ఆఫ్టర్ ఆస్కార్..ఎన్టీఆర్/చరణ్ ఎవరు మనసు గెలిచారు?

1121107-rrr

తెలుగు చలన చిత్ర పరిశ్రమ దగ్గర మొట్ట మొదటి సారిగా ప్రపంచ ప్రఖ్యాత అవార్డు ఆస్కార్ మొట్ట మొదటి సారి వరించడం చరిత్రగా నిలిచింది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా దర్శక శిఖరం ఎస్ ఎస్ రాజమౌళి ల కాంబో లో వచ్చిన భారీ సినిమా ఆర్ ఆర్ ఆర్ చరిత్ర సృష్టించింది.

సినిమాలో నాటు నాటు సాంగ్ కి గాను రెండు ఆస్కార్ అవార్డులు వచ్చాయి. దీనితో ఈ సినిమా మొత్తానికి అవార్డు వచ్చినట్టుగా చిత్ర యూనిట్ భావిస్తున్నారు. దీనితో ఈ సక్సెస్ ని జాతికి అంకితం చేస్తున్న దర్శకుడు మరియు బృందం విషయంలో హీరోల ఫ్యాన్స్ మాత్రం ఇప్పటికీ తన్నుకుంటున్నారు.

ఇక నిన్న ఆస్కార్ ఈవెంట్ లో కూడా ఇదే తంతు. మా హీరో పిక్ అంటే మా హీరో పిక్ అంటూ  మా వాడే హైలైట్ అంటూ ఓ రేంజ్ రచ్చ చేస్తున్నారు. కానీ ఇద్దరు హీరోల్లో ఆస్కార్ గెలిచిన తర్వాత ఎన్టీఆర్ మరియు చరణ్ పోస్ట్ లు చాలా వ్యత్యాసం ఇప్పుడు అంతా గమనిస్తున్నారు.

ఆస్కార్ గెలిచాక అలాగే ఈవెంట్ కి జస్ట్ ముందు కూడా ఎన్టీఆర్ కేవలం తన వరకు పోస్ట్ లు తానే ఉన్నట్టుగా పోస్ట్ లు పెట్టుకున్నాడు కానీ చరణ్ మాత్రం ఈ విజయం అంతా తమ టీం మొత్తంది అంటూ తెలిపాడు. ప్రెస్ నోట్ రిలీజ్ చేసాడు. అలాగే ఈవెంట్ ముందు కూడా తాను ఎన్టీఆర్ రాజమౌళి కలిసి ఉన్న పిక్ షేర్ చేసుకున్నాడు. దీనితో ఈ తేడా ఇద్దరు హీరోస్ విషయంలో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.