అందరి ముందే ఆది పరువు తీసిన నటి సంఘవి.. దెబ్బకు తోక ముడిచిన ఆది?

హైపర్ ఆది ఈ పేరు గురించి పరిచయం అవసరం లేదు. ఈయన జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో గుర్తింపు సంపాదించుకున్నప్పటికీ ప్రస్తుతం ఆ కార్యక్రమంలో కనిపించకపోయినా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆది కొన్ని ప్రాజెక్ట్స్ వల్ల జబర్దస్త్ కార్యక్రమానికి కాస్త దూరమయ్యానని త్వరలోనే రీ ఎంట్రీ ఇస్తానని చెప్పేశారు. ఇకపోతే కార్యక్రమంలో కీలకంగా మారిపోయారు. అక్కడ ఆది చెప్పిందే శాసనం అనేలా ఈయన వ్యవహరిస్తున్నారు. ఇకపోతే ప్రతివారం కొత్త గెస్టులతో ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తుంది.

ఇకపోతే ఈ ఆదివారం ప్రసారం కాబోయే కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా ఈ కార్యక్రమానికి హీరోయిన్ సంఘవి ముఖ్యఅతిథిగా హాజరైనట్టు తెలుస్తుంది. సంఘవి ఎన్నో తెలుగు సినిమాలలో నటించి నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే ప్రస్తుతం వెండితెరకు దూరమయ్యారు. ఇకపోతే ఈ కార్యక్రమంలో సందడి చేసిన సంఘవి అందరి ముందు దారుణంగా హైపర్ ఆది పరువు తీశారు.సంఘవి ఈ కార్యక్రమానికి రాగానే హైపర్ ఆది ఎప్పటిలాగే తన పులిహోర వేషాలు ఆమె దగ్గర వేయాలని చూసాడు. అయితే సంఘవి దెబ్బకు తోక ముడిచాడు.

శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలోకి సంఘవి ఎంట్రీ ఇవ్వగానే.. ఒక్కసారి ముద్దు పెడితే ఎలా ఉంటుంది అనే పాట వేశారు. ఇక సంఘవి రాగానే హైపర్ ఆది తనతో మాట్లాడుతూ సంఘవి గారు మీరు ఒక్కసారి ముద్దు పెడితే ఎలా ఉంటది అనే పాట చేశారు కదా.. ఒకసారి ముద్దు పెడితే ఎలాగుంటుంది అని ఆమెను అడగడంతో బాగుంటుంది అని సమాధానం చెప్పింది. మరి రెండోసారి ముద్దు పెడితే ఎలా ఉంటుంది అని తనని ప్రశ్నించాడు. దీంతో ముందు నీకు రెండు తగిలిస్తే బాగుంటుంది అంటూ తనపై చేయి ఎత్తారు. ఈ విధంగా సంఘవి దెబ్బకు మనోడు వెనకడుగు వేశారు. మొత్తానికి ఈ ప్రోమో పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.