ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా 98 కేజీల బ‌రువు తగ్గిన ఆ సెల‌బ్రిటీ ఎవ‌రో తెలుసా?

ఒకప్పుడు జిమ్‌లు, వ‌ర్కవుట్ సెంటర్స్ లాంటివి లేక‌పోవ‌డంతో సెల‌బ్స్ పెద్ద‌గా త‌మ మేకొవ‌ర్‌పై దృష్టి పెట్టేవాళ్లు కాదు. కాని ఇప్పుడు ప‌రిస్థితులు మారాయి. హీరోలైతే సిక్స్ ప్యాక్ లు ట్రై చేస్తుంటే హీరోయిన్స్ జీరో సైజ్ మెయింటైన్ చేస్తున్నారు. మ‌రి ఇందుకోసం వారు ప‌డే క‌ష్టాలు అన్నీ ఇన్నీ కావు. పక్కా ప్ర‌ణాళిక‌తో త‌మ బ‌రువు త‌గ్గించుకుంటూ ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా ముందుకు సాగుతున్నారు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు మ‌నం 10,20 మ‌హా అయితే 30 కేజీలు త‌గ్గిన సెల‌బ్రిటీల గురించి విన్నాం. కాని ఈ బాలీవుడ్ కొరియోగ్రాఫ‌ర్ ఏకంగా 98 కేజీలు త‌గ్గి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు.

ఆచార్య గ‌ణేష్‌.. ఈ పేరు చాలా సుప‌రిచితం. దాదాపు 200 కేజీల బరువు ఉండే ఆయ‌న అంత‌టి బాడీతోను చాలా ఈజ్‌గా స్టెప్పులేసేవాడు. ఎన్నో అవార్డుల‌ని కూడా సంపాదించుకున్నాడు. అయితే బ‌రువు అత‌నికి మ‌రింత భారంగా మారుతున్న క్ర‌మంలో స‌న్న‌గా అవ్వాల‌ని డిసైడ్ అయి ఏకంగా 98 కేజీలు త‌గ్గాడు. ఇప్పుడు అత‌నిని మ‌నం చూస్తూ మ‌న క‌ళ్లు మ‌న‌ల్ని మోసం చేస్తున్నాయా అనిపిస్తుంటుంది. అస‌లు ఆయ‌న ద‌గ్గ‌రి వారు కూడా ఆచార్య గ‌ణేష్‌ని గుర్తు ప‌ట్టే ప‌రిస్థితి లేదు

రీసెంట్ ఆచార్య గ‌ణేష్‌.. క‌పిల్ శ‌ర్మ షోకు గీతా క‌పూర్, లూయిస్‌తో క‌లిసి వ‌చ్చారు. అక్క‌డ ఆచార్య‌ని అంతా నోరెళ్ల‌పెట్టారు. ఎవ‌రిని పిలిస్తే ఎవ‌రు వ‌చ్చారంటూ చ‌మ‌త్క‌రించారు క‌పిల్‌. అయితే ఈ షోలో ఇంత స్లిమ్‌గా మారారంటే ఎన్ని కేజీల బ‌రువు త‌గ్గార‌ని క‌పిల్‌.. ఆచార్య‌ని అడ‌గ‌గా అందుకు ఆయ‌న ఓ 98 కిలోలు గ‌గ్గి ఉంటాను అని స‌మాదానం ఇచ్చాడు. అంటే మీలో ఉన్న ఇద్ద‌రు మ‌నుషుల‌ని చంపేశారన్న‌మాట అంటూ కామెడీ చేశాడు క‌పిల్. బాలీవుడ్‌లో ఎన్నో సూప‌ర్ హిట్ సాంగ్స్‌కు కొరియోగ్ర‌ఫీ చేసిన ఆచార్య తెలుగులో డిజే సినిమాకి సంబంధించిన గుడిలో మడిలో అనే పాట‌కు అదిరిపోయే స్టెప్పులు కంపోజ్ చేసాడు. మొత్తానికి ఈయన మేకోవర్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది.