Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసు: రోజుకో కొత్త మలుపు

Saif Ali Khan: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై జరిగిన దాడి కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ముంబై పోలీసుల విచారణలో బయటపడుతున్న విషయాలు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఈ దాడి వెనుక ఉన్న ప్రధాన నిందితుడు మహమ్మద్ షరీఫుల్, ఏడు నెలల క్రితం బంగ్లాదేశ్ నుండి డౌకీ నది ద్వారా అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించినట్లు గుర్తించారు.

ముంబై చేరుకున్న తర్వాత విజయ్ దాస్ అనే నకిలీ పేరుతో పని చేస్తున్న షరీఫుల్, సైఫ్ నివాసం సద్గురు అపార్ట్‌మెంట్‌ వద్దకు చేరుకున్నాడు. జనవరి 16న, అతను పన్నెండవ అంతస్థుకు పైపుల ద్వారా చేరి బాత్రూమ్ కిటికీ ద్వారా ఇంట్లోకి ప్రవేశించాడు. అప్పటికే సైఫ్ కుటుంబం అక్కడే ఉండగా, అతను కేర్ టేకర్‌ను బెదిరించి డబ్బు డిమాండ్ చేశాడు.

సైఫ్ అప్రమత్తమై పరిస్థితిని నియంత్రించడానికి ప్రయత్నించగా, షరీఫుల్ కత్తితో దాడి చేశాడు. తర్వాత, అతన్ని ఒక గదిలో బంధించారు. అయితే, అతను ఆ తరువాత చాకచక్యంగా తప్పించుకున్నాడు. ఈ సంఘటన తరువాత సైఫ్‌ను ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా, పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు.

దాడి తర్వాత, వర్లీలోని పావ్ భాజీ సెంటర్ వద్ద షరీఫుల్ యుపిఐ పేమెంట్ ద్వారా వెలుగులోకి తెచ్చాడు. చివరగా, పోలీసులు హీరానందని ఎస్టేట్ వద్ద అతన్ని పట్టుకున్నారు. ఇలాంటి ఘటనలు ఇండస్ట్రీలోని భద్రతా చర్చలకు దారితీస్తున్నాయి. ప్రస్తుతం సైఫ్ ఆరోగ్యం నిలకడగా ఉండగా, కేసు విచారణ కొనసాగుతోంది.

లోకేష్ ను ఎవడు ఆపలేడు || Chintamaneni Prabhakar Sensational Interview || Lokesh, Pawan Kalyan || TR