ఇండస్ట్రీ టాక్ : “పుష్ప 2” పై క్రేజీయెస్ట్ న్యూస్..

రాబోయే రోజుల్లో పాన్ ఇండియా సినిమాని షేక్ చేసే టాలీవుడ్ భారీ చిత్రాల్లో పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన భారీ చిత్రం “పుష్ప 2 ది రూల్” కూడా ఒకటి అని డెఫినెట్ గా చెప్పొచ్చు. ఇంకా సినిమా కంప్లీట్ అవ్వకుండానే 1000 కోట్ల నెట్ వసూళ్లు కొల్లగొడుతుంది అనే స్ట్రాంగ్ బజ్ దీనిపై ఉండగా.

సినిమా నుంచి వస్తున్నా ఒకో కంటెంట్ టాలీవుడ్ సహా పాన్ ఇండియా ఆడియెన్స్ లో మంచి బజ్ ని తీసుకొచ్చాయి. కాగా ఇదిలా ఉండగా ఈ సినిమా నుంచి మేకర్స్ నిన్ననే సెన్సేషనల్ అప్డేట్ సినిమా రిలీజ్ పై ఇచ్చేసారు. ఈ అప్డేట్ తో అయితే పుష్ప 2 వచ్చే ఏడాది ఆగష్టు 15న రిలీజ్ చేస్తున్నట్టుగా ఫిక్స్ చేసారు.

అయితే పుష్ప 2 పై ఇప్పుడు ఒక క్రేజీయెస్ట్ న్యూస్ అయితే సినీ వర్గాల్లో వినిపిస్తుంది. దీనితో అయితే అసలు ఈ సినిమా పార్ట్ 2 నే మెయిన్ అట. అసలు కథ అంతా ఇందులోనే ఉంటుంది అని ఈ భాగం చూసిన తర్వాత పుష్ప పార్ట్ 1 దీని ముందు ఎందుకూ పనికి రాదనీ అంటున్నారు.

అలాగే పుష్ప 1 అనేది జస్ట్ ఇంట్రడక్షన్ అయితే మెయిన్ కథ అంతా పార్ట్ 2 లోనే స్టార్ట్ అవుతుంది అని ఇది ఎవరూ ఊహించని లెవెల్లో ఉంటుంది అని దర్శకుడు సుకుమార్ ఈ సీక్వెల్ ని మాత్రం చాలా పకట్బందీగా ప్లాన్ చేస్తున్నాడు అని రూమర్స్ వినపడుతున్నాయి. మొత్తానికి అయితే పుష్ప ది రూల్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది అని చెప్పాలి. కాగా ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుంది.