కేవలం టెన్త్ అర్హతతో ఈ కేంద్ర ప్రభుత్వ కొలువులలో చేరవచ్చు.. పూర్తి వివరాలివే!

Job-Vacancy

ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ఇది శుభవార్త.కేవలం టెన్త్ డిప్లమా అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో కొలువుదీరే అవకాశాన్ని నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుంది.
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ పలు పోస్టులని భర్తీ చేస్తోంది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పలు విభాగాల్లో ఖాళీలు వున్నాయి. మహారాష్ట్ర లోని తారాపూర్ కేంద్రంలో ఉన్న ఈ ఖాళీలని భర్తీ చేయనున్నారు.

ఇందులో మొత్తం 193 పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇలా ఈ పోస్టులలో చేరడం కోసం ఆసక్తి ఉన్నవారు వెంటనే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే వారికి ఎలాంటి అర్హతలు ఉండాలి అనే విషయానికి వస్తే… పదో తరగతి లేదా సంబంధిత విభాగం లో ఐటీఐ, 10+2, డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఇక ఈ ఉద్యోగాలకు ఎంపిక విధానం ఎలా ఉంటుంది అనే విషయానికి వస్తే రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అలానే మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి 28 ఫిబ్రవరి ఆఖరి తేదీ.

ఈ ఉద్యోగాలు చేయడానికి ఆసక్తి గల అభ్యర్థులు ఫిబ్రవరి 28 లోపు అప్లై చేసుకోవాలి.

పోస్టుల ఖాళీల వివరాలు:

స్టైపెండరీ ట్రైనీ/ టెక్నీషియన్ (158)
నర్సు-ఎ (మేల్‌/ ఫిమేల్‌) (26)
పాథాలజీ ల్యాబ్ టెక్నీషియన్ (సైంటిఫిక్ అసిస్టెంట్/ బి) (3)
ఫార్మసిస్ట్/ బి (4)
స్టైపెండరీ ట్రైనీ/ డెంటల్ టెక్నీషియన్ (మెకానిక్) (1)
ఎక్స్-రే టెక్నీషియన్/ సి (1)

ఈ పోస్టులకు సంబంధించి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాలి అంటే https://npcilcareers.co.in/TMS20232202/candidate/Default.aspx లో చూసి అప్లై చేసుకోవచ్చు.