నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు.. రూ.2 లక్షల వేతనంతో ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు!

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. అసిస్టెంట్ డైరెక్టర్, సైంటిస్ట్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి సిద్ధమైంది. upsc.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 29వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. మొత్తం 67 పోస్ట్ లను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

అసిస్టెంట్ డైరెక్టర్ ఉద్యోగ ఖాళీలు 51 ఉండగా సైంటిస్ట్-బీ (ఫిజికల్-సివిల్)- ఒక పోస్ట్ ఉంది. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గ్రేడ్ 1 ఉద్యోగ ఖాళీలు 2 ఉండగా సైంటిస్ట్-బీ 9 ఉద్యోగ ఖాళీలు, స్పెషలిస్ట్ గ్రేడ్ iii 3 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. 40 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తోంది.

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ఏరోనాటికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ విభాగాలతో పాటు సివిల్/మెకానికల్/కంప్యూటర్ సైన్స్ పాసైన వాళ్లు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏరోడ్రోమ్ కంట్రోల్‌లో రెండేళ్ల అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. అధికారిక పోర్టల్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉంటుందని చెప్పవచ్చు.

యూపీఎస్సీ రిక్రూట్‌మెంట్ 2024 లింక్ పై క్లిక్ చేయడం ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం జరగనుంది. అర్హత ఉన్నవాళ్లు యూపీఎస్సీ ఉద్యోగ ఖాళీల కోసం వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు బెనిఫిట్ కలగనుంది.