ఆధార్ విషయంలో కేంద్రం సంచలన నిర్ణయం.. ఆ తప్పు వేస్తే పోలీసులే వస్తారంటూ?

మన దేశంలో నివశించే వాళ్లకు ఆధార్ కార్డ్ ముఖ్యమనే సంగతి తెలిసిందే. ఆధార్ కార్డ్ గుర్తింపు కార్డ్ గా ఉపయోగపడటంతో పాటు వేర్వేరు సందర్భాల్లో ఈ కార్డ్ ను వినియోగిస్తాం. ఆధార్ కార్డ్ ను పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కలిగి ఉండాలి. ఇప్పటికే ఆధార్ విషయంలో కేంద్రం ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకోగా తాజాగా కేంద్రం మరో సంచలన నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది.

18 ఏళ్లు నిండి తొలిసారి ఆధార్ కార్డ్ ను తీసుకునే వాళ్లు ఫిజికల్ వెరిఫికేషన్ కు హాజరు కావాల్సి ఉంటుంది. పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ తరహా వ్యవస్థను యూఐడీఏఐ సిద్ధం చేస్తోంది. నోడల్ ఆఫీసర్లు, సబ్ డివిజనల్ ఆఫీసర్లను ఇందుకోసం కేంద్రం నియమించనుందని సమాచారం అందుతోంది. సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ఆధ్వర్యంలో వెరిఫికేషన్ పూర్తైన తర్వాత 180 రోజుల్లో ఆధార్ ను జారీ చేయడం జరుగుతుంది.

ఆధార్ కార్డు జారీ అయిన తర్వాత సాధారణ పద్ధతుల ద్వారా వివరాలను అప్ డేట్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. తొలిసారి ఆధార్ కార్డ్ తీసుకోవాలని భావించే వాళ్లు మాత్రమే ఈ నిబంధనలు వర్తించనున్నాయి. 18 ఏళ్లు నిండిన వాళ్లు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి.ఆధార్ కార్డ్ ను పోగొట్టుకుంటే మాత్రం కొన్ని ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్ మిస్ చేసుకుంటే ఆన్ లైన్ ద్వారా కొత్తది తీసుకోవచ్చు.

ఆధార్ కార్డ్ ఉంటే మాత్రమే కొన్ని పథకాలను పొందే అవకాశం అయితే ఉంటుంది. మన దేశానికి చెందిన పౌరులు మాత్రమే ఆధార్ కార్డ్ పొందే అవకాశం ఉంటుంది. కేంద్రం అమలు చేస్తున్న పథకాల ప్రయోజనాలను పొందాలన్నా ఆధార్ కార్డ్ ను తప్పనిసరిగా కలిగి ఉండాలి.