నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు.. లక్ష రూపాయల వేతనంతో ఎస్బీఐలో ఉద్యోగాలు?

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 439 ఉద్యోగ ఖాళీల భర్తీ దిశగా అడుగులు వేసింది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు ఏకంగా లక్ష రూపాయల వేతనం లభించనుందని తెలుస్తొంది. బ్యాంక్ ఉద్యోగాలు కోరుకునే వాళ్లకు ఇది నిజంగా శుభవార్త అనే చెప్పాలి. స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్స్ ఉద్యోగ ఖాళీలు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయి.

అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, చీఫ్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, ప్రాజెక్ట్ మేనేజర్, మేనేజర్ ఉద్యోగ ఖాళీలు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానుండగా అక్టోబర్ 6వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 2023 డిసెంబర్ లేదా 2024 జనవరి నెలలో ఆన్ లైన్ పరీక్షను నిర్వహించే అవకాశం ఉంటుంది.

వేర్వేరు ఉద్యోగ ఖాళీలకు వేర్వేరు అర్హతలు ఉన్న నేపథ్యంలో అర్హతల ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. అనుభవం ఉన్నవాళ్లు కూడా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉంటుంది. 45 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 750 రూపాయలు కాగా ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు.

రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ జరగనుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు లక్ష రూపాయల వేతనం లభించే అవకాశం ఉంటుంది. https://www.sbi.co.in/web/careers వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి ఉన్న అభ్యర్థులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా మేలు జరగనుంది.