ఎస్బీఐలో రిసాల్వర్ ఉద్యోగ ఖాళీలు.. పరీక్ష లేకుండానే రూ.45 వేల వేతనంతో?

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు మరో తీపికబురు అందించింది. 94 రిసాల్వర్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. sbi.co.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్ నెల 1వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలు కానుంది.

నవంబర్ నెల 23వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. రిటైర్డ్ బ్యాంకు అధికారుల నుంచి దరఖాస్తులను ఎస్బీఐ స్వీకరిస్తుండగా అర్హత ఉన్నవాళ్లకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే వ్యక్తి గతంలో ఎస్బీఐలో పని చేసి ఉంటే విద్యార్హతతో సంబంధం లేకుండా ఈ ఉద్యోగంలో చేరే ఛాన్స్ అయితే ఉంటుంది.

ఎస్బీఐలో పని చేసిన మాజీ అధికారులకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుందని సమాచారం అందుతోంది. ఇంటర్వ్యూ రౌండ్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది. 100 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తుండగా కనీస అర్హత మార్కుల ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీల ఎంపిక ప్రక్రియ జరగనుందని సమాచారం అందుతుండటం గమనార్హం.

మెరిట్ జాబితా ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుందని సమాచారం అందుతోంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఎలాంటి ఫీజు లేకుండా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు చేకూరనుంది.