రూ. 3000 ఇన్వెస్ట్ చేసి రూ.44 లక్షలు పొందే అద్భుతమైన స్కీమ్..?

icici bank offers overdraft facility for salaried employees

సమాజంలో మనిషి తన మనుగడ కొనసాగించాలంటే డబ్బు కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ప్రస్తుతం పెరిగిన ద్రవ్యోల్బణం కారణంగా సామాన్య ప్రజల జీవితాలు అస్తవ్యస్తంగా మారిపోయాయి. గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్, కూరగాయలు వంటి నిత్యావసర వస్తువుల ధరలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో సామాన్య ప్రజలకు జీవనం భారంగా మారింది. అందువల్ల జీవితంలో ఇలాంటి ఆర్థిక సమస్యలు తలెత్తకుండా ముందుగానే భవిష్యత్తు కోసం పొదుపు చేసుకోవడం చాలా అవసరం. ఇప్పటికే ప్రజలను ఆర్థికంగా ఆదుకోవడానికి ప్రభుత్వాలు ఎన్నో పథకాలను అందిస్తున్నాయి. ఈ పథకాలలో పెట్టుబడి పెట్టడం వల్ల భవిష్యత్తులో ఎదురయ్యే ఆర్థిక సమస్యలను అధిగమించవచ్చు.

ఇలా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలలో నేషనల్ పెన్షన్ సిస్టమ్ స్కీమ్ కూడా ఒకటి. రిటైర్మెంట్‌ తర్వాత ఉద్యోగస్తులకు ఆర్థిక భద్రతను అందించడానికి ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించింది. ఇది మొదట్లో ప్రభుత్వ రంగాలలో పనిచేసే వారికి మాత్రమే వర్తించేది. కానీ తర్వాత ప్రైవేట్ రంగంలో పనిచేసే వారికి అందుబాటులోకి వచ్చింది. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. ఈ పథకంలో కనిష్టంగా రూ.500 ప్రారంభ పెట్టుబడి పెట్టవచ్చు. అయితే ఈ స్కీం లో రెండు రకాల ఖాతాలుంటాయి ఒకటి టైర్ 1 మరొకటి టైర్ 2 ఈ రెండింటిలో ఎందులోనైనా పెట్టుబడి పెట్టవచ్చు.

ఉదాహరణకు ఈ పథకంలో నెలకు రూ.3000 చొప్పున ప్రతినెల పొదుపు చేస్తూ ఉండాలి. ఇలా మీకు 60 సంవత్సరాలు వయసు దాటే వరకు ఇలా పెట్టుబడి పెట్టాలి. ఒకవేళ మీరు 18 సంవత్సరాల నుండి 60 ఏళ్ల వరకు ఈ పథకంలో పెట్టుబడి పెడితే 44 లక్షలకు పైగా ఆదాయం పొందవచ్చు. అలా కాకుండా 34 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వరకు దాదాపు 26 సంవత్సరాల పాటు ఈ పథకంలో ప్రతి నెల 3000 రూపాయలు పెట్టుబడి పెడితే దీని మెచ్యూరిటీపై రూ.44.35 లక్షలు పొందుతారు. ఇలా ప్రతి నెల రూ. 3000 రూపాయలు ఇన్వెస్ట్ చేసి రిటైర్మెంట్ పొందిన తర్వాత రూ.44 లక్షలు పొందవచ్చు.