నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు.. నెలకు రూ.88000 వరకు వేతనంతో ఉద్యోగ ఖాళీలు!

దేశంలోని నిరుద్యోగులకు బెనిఫిట్ కలిగేలా వరుస జాబ్ నోటిఫికేషన్లు వెలువడుతుండగా ట్రేడ్స్‌మన్ ట్రైనీ ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 67 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు రూ.88000 వరకు జీతం లభించనుంది. అధికారిక వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

మార్చి నెల 15వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్ లో ఐటీఐ, ఎన్.ఏ.సీ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి 35 సంవత్సరాలుగా ఉంది. ఎస్సీ, ఎస్టీలకు గరిష్ట వయోపరిమితి 5 సంవత్సరాలు మినహాయింపుగా ఉండనుందని తెలుస్తోంది.

ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 88000 రూపాయల వరకు వేతనం లభించనుంది. అధికారిక నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఇతర వివరాలను తెలుసుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు రుసుము 500 రూపాయలుగా ఉంది. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు ఫీజును చెల్లించే అవకాశం అయితే ఉంటుంది.

రాత పరీక్ష, స్కిల్ టెస్ట్/ట్రేడ్ టెస్ట్, సైకోమెట్రిక్ టెస్ట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుందని సమాచారం అందుతోంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా బెనిఫిట్ కలగనుంది. అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిది.