ఆదాయపు పన్ను శాఖలో 291 ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్.. భారీ వేతనంతో?

ఆదాయపు పన్ను శాఖ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు చెప్పింది. ముంబై రీజియన్‌లోని వివిధ పోస్టుల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మొత్తం 291 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 137, క్యాంటీన్ అటెండెంట్ 3 పోస్టులు ఉండగా ఇన్‌స్పెక్టర్ 14, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి 18, టాక్స్ అసిస్టెంట్ 119 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.

డిసెంబర్ 22 నుండి ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. జనవరి 19వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. incometaxmumbai.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ డిగ్రీని కలిగి ఉన్నవాళ్లు ఇన్‌కమ్ ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్, టాక్స్ అసిస్టెంట్ పోస్టులకు అర్హత కలిగి ఉంటారు.

స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి ఇంటర్ పాసైన అభ్యర్థులు అర్హత కలిగి ఉంటారు. ఎంటీఎస్, క్యాంటీన్ అటెండెంట్ ఉద్యోగాలకు 10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హత కలిగి ఉంటారు. ఈ ఉద్యోగ ఖాళీలకు కనీస వయోపరిమితి 18 సంవత్సరాలుగా ఉండగా గరిష్ట వయోపరిమితి ఇన్‌స్పెక్టర్‌కు 30 సంవత్సరాలుగా ఉంది. స్టెనోగ్రాఫర్,టాక్స్ అసిస్టెంట్‌ ఉద్యోగాలకు 27 సంవత్సరాలు, ఎంటీఎస్ క్యాంటీన్ అటెండెంట్‌ ఉద్యోగాలకు 25 సంవత్సరాలుగా ఉంది.

స్పోర్ట్స్ కోటా కింద ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుండగా విద్యార్హతతో పాటు క్రీడా అర్హతను కలిగి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హత కలిగి ఉంటారు. అంతర్జాతీయ స్థాయిలో దేశానికి ప్రాతినిధ్యం వహించే అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. నోటిఫికేషన్‌ చెక్ చేయడం ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.