ఆర్థిక సమస్యలు తొలగిపోయి ధనవంతులు కావాలనుకుంటే ఇత్తడి పాత్రతో ఇలా చేయండి..?

మన హిందూ సంప్రదాయంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది . ప్రజలకు వాస్తు శాస్త్రం పట్ల అపారమైన నమ్మకం ఉండటమే కాకుండా వాస్తు నియమాలను తప్పనిసరిగా పాటిస్తూ ఉంటారు. సాధారణంగా ఇంట్లో వాస్తు దోషము ఉండటంవల్ల అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఇంట్లో వాస్తు దోషం ఉన్నప్పుడు ఎన్ని పూజలు వ్రతాలు చేసినా కూడా సమస్యలు మాత్రం తగ్గవు. అలాంటి సమయంలో వాస్తు నియమాల ప్రకారం కొన్ని నియమాలు పాటించటం వల్ల ఇంట్లో ఉన్న సమస్యలు దూరం అవుతాయి.

వాస్తు శాస్త్రం ప్రకారం ఇత్తడితో తయారుచేసిన సూర్యుడి ప్రతిమను ఇంటి గుమ్మం ముందు వేలాడు తీయాలి. పంచానికి వెలుగునిచ్చే సూర్యభగవానుడి ప్రతిమను ఇంటి గుమ్మం ముందు వేలాడ తీయడం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తి ప్రవేశించకుండా అడ్డుకుంటుంది. సూర్యుడి ప్రతిమతో పాటు ఇతరులతో తయారుచేసిన స్వస్తిక్ గుర్తును కూడా ఇంటి గుమ్మంలో వేలాడు తీయాలి. ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోయి ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు అన్నీ కూడా దూరం అవుతాయి. అంతే కాకుండా కుటుంబ సభ్యుల మధ్య కూడా సఖ్యత ఏర్పడుతుంది.

అలాగే వాస్తు దోషం వల్ల ఇంట్లో తరచూ సమస్యలు ఎదురవుతూ ఉన్నట్లయితే ఇంట్లో ఈశాన్య దిశ‌లో ఒక భారీ ఇత్త‌డి పాత్ర‌ను ఉంచాలి. ఆ ఇత్తడి పాత్రను మొత్తం నీళ్ల‌ను నింపాలి. ఇలా 15 రోజుల‌కు ఒక‌సారి ఆ ఇత్తడి పాత్రలోని నీటిని మారుస్తుండాలి. ఇలా చేయటం వల్ల మ‌న ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోయి ధన ప్రాప్తి కలుగుతుంది. అలాగే భవిష్యత్తులో కూడా ఆర్థిక సమస్యలు మన దరి చేరకుండా ధ‌నం అలా క‌ల‌కాలం నిలిచి ఉండి ధనవంతులు అవుతారు. ఇలా చేయటం వల్ల జీవితంలో ఎప్పుడు కూడా ఆర్థిక సమస్యలు ఎదురవు.