ఈ గుర్తులు కనిపిస్తే షిరిడీకి రావాలని బాబా పిలుస్తున్నట్టే.. తప్పక షిరిడీకి వెళ్లాల్సిందే!

దేవుడుది, భక్తుడుది విడదీయరాని బంధం. పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు కూడా దేవుడి దర్శనం అనంతరమే నింగిలోకి రాకెట్లు పంపుతున్నారు. దేవుడి మీద నమ్మకం లేని నాస్తికుల గురించి మనం ఏం మాట్లాడం కానీ.. చాలా మందికి అప్పుడప్పుడు దేవుడు కలలోకి వస్తుంటాడని అంటుంటారు. అయితే ఇలాంటి గుర్తులు కనిపిస్తే తప్పుకుండా షిరిడి సాయినాథుడిని దర్శించుకోవాలంటున్నారు.

సాయి బాబా భ‌క్తులు ప్ర‌తి ఒక్క‌రు జీవితంలో ఒక్క‌సారైనా షిరిడీకి వెళ్లి బాబాను ద‌ర్శించుకోవాల‌ని కోరుకుంటారు.అయితే కొంద‌రు అనుకోకుండానే షిరిడీకి వెళ్తూ ఉంటారు. కొంద‌రు ఎంత ప్రయ‌త్నించినా కూడా షిరిడీని వెళ్ల‌లేరు. అయితే బాబా అనుగ్రహం లేనిదే షిరిడికి వెళ్లలేమని చాలా మంది అంటూ ఉంటారు.

షిరిడి సాయినాథుడు అనుకున్న కోరికలు తీర్చుతారని భక్తుల నమ్మకం. అందుకే చాలా మంది ఏడాదికి ఒకటి రెండు సార్లు తప్పుకుండా ఆయన్ని దర్శించుకుంటారు. మరికొందరు అక్కడే నిద్ర కూడా చేస్తారు. అయితే షిరిడీకి ర‌మ్మ‌ని త‌న ద‌ర్శనం చేసుకోమ‌ని బాబా మ‌న‌కు సంకేతాల‌ను పంపుతార‌ని పండితులు చెబుతున్నారు. రకరకాల కారణాల వల్ల
మనం షిరిడికి వెళ్లటం మరిచిపోయినా, బాబా గుర్తు చేస్తారని పండితులు అంటున్నారు.

సాధారణంగా మ‌నం సంతోషంగా ఉన్న‌ప్పుడు మ‌నంత‌ట మ‌న‌మే షిరిడీ ద‌ర్శ‌నానికి వెళ్తాం. కానీ క‌ష్టాల్లో, బాధ‌ల్లో ఉన్న‌ప్పుడు బాబా ఈ సంకేతాల‌ను మ‌న‌కు పంపుతారు. బాబా ద‌ర్శ‌నం చేసుకుంటే క‌ష్టాలు, బాధ‌లు తొల‌గిపోతాయ‌ని దీని అర్థం. అలాగే బాబా గారు మ‌నకు క‌ల‌లో ద‌ర్శ‌న‌మిస్తారు. మ‌న చెయ్యి ప‌ట్టుకుని బాబా గారు మ‌న‌ల్ని షిరిడీ తీసుకెళ్తున్న‌ట్టుగా, అలాగే ఏదోఒక రూపంలో బాబా గారి ద‌ర్శ‌నం మ‌న‌కు క‌లుగుతుంది. ఇలా బాబా గారు మ‌న‌కు క‌ల‌లో క‌నిపిస్తే క‌నుక మ‌న‌కు షిరిడీకి బాబాగారు మ‌న‌కు పంపించే సంకేతంగా భావించాలంటున్నారు పండితులు.