శనివారం రోజున బెల్లం ముక్కను అక్కడ పాతితే అప్పులు తొలగుతాయా.. ఏం చేయాలంటే?

ఈ మధ్యకాలంలో చాలామంది చాలా రకరకాలుగా ఇబ్బందుల పాలవుతున్నారు. ముఖ్యంగా అప్పుల విషయంలో మాత్రం చాలామంది సతమతమవుతున్నారు. ఎంత డబ్బు సంపాదించినా కూడా అప్పులకే దార పోయడంతో చాలామంది ఈ సమస్యల నుండి ఎలా బయటపడాలి అని ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే అటువంటి వారికే ఈ ఈ పరిహారమే పరిష్కారమని చెప్పాలి.

 

ఇంతకు అప్పుల సమస్య పోయి ధనవంతులు కావాలి అంటే దానికి ఒక్కటే పరిహారం ఇంట్లో వాడే బెల్లం ముక్క అని చెప్పాలి. అవును మీరు విన్నది నిజమే. కేవలం బెల్లం ద్వారా ఆర్థిక సమస్యలు తొలగిపోతాయా అంటే అవునని అంటున్నాయి కొన్ని శాస్త్రాలు. మామూలుగా బెల్లం ముక్క ను తినడానికి, ఏదైనా తయారు చేయడానికి వాడుతూ ఉంటాం.

 

కేవలం తినడానికే కాకుండా తాంత్రిక, జ్యోతిష్య పరంగా కూడా ఉపయోగపడుతుంది బెల్లం. గ్రహదోషాలు తొలగించడానికి కూడా ఈ బెల్లం బాగా పనిచేస్తుంది. ఇక ధనం కూడా నిలబడడానికి ఈ బెల్లం ఒక సులువైన మార్గమని చెప్పాలి. అయితే ఏం చేయాలి అంటే ఒక ఎర్రటి వస్త్రం, బెల్లం, రూపాయి కాయిన్ సిద్ధం చేసుకుని ఉంచుకోవాలి.

 

అయితే ఈ పరిహారంను శనివారం రోజు చేయాలి. శనివారం ఉదయాన్నే లేచి శుభ్రంగా స్నానం చేసిన తర్వాత ఒక ఎర్రటి వస్త్రం తీసుకొని అందులో చిన్న బెల్లం ముక్కను (నల్లది/తెల్లది) తీసుకోని అందులో రూపాయి కాయిన్ వేసి తర్వాత గట్టిగా కట్టేసి ఆ తర్వాత పారే నీటిలో వదిలేయాలి. ఒకవేళ అటువంటి నీటి సదుపాయాలు లేకపోతే రావిచెట్టు దగ్గర లేదా రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉన్న చోట ఆ మూటను పెట్టాలి.

 

ఈ పరిహారాలు ఉదయం నుండి సాయంత్రం 6 లోపు చేయటం మంచిది. అంతేకాకుండా ఐదు శనివారాలు ఇలా చేస్తే కుజ గ్రహ ప్రభావం తొలగిపోయి అప్పుల సమస్యలు తొలగిపోతాయి. అంతేకాకుండా శనివారం, మంగళవారం రోజులలో బెల్లం ముక్కను ఆవుకి తినిపించినా కూడా కోరికలు తీరుతాయని కొన్ని శాస్త్రాన్ని చెబుతున్నాయి.

 

ఇక శనివారం రోజు దేవుడి దగ్గర బెల్లం ముక్కను పెట్టి ఆ తర్వాత ఆ బెల్లం ముక్కను తీసుకొని ఏదైనా ఒక చెట్టు మొదట్లో తవ్వి పెట్టాలి. లేదా కుండీలో కూడా పాతి పెట్టొచ్చు. ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలతో పాటు కుటుంబ సమస్యలు కూడా తొలగిపోతాయి. ఇలా నెలకు ఒకసారి చేసిన కూడా సరిపోతుంది.

రేపు శనివారం రోజు బెల్లం ముక్కని అక్కడ పాతిపెడితే అప్పులు తొలగి పోయి  అప్పు ఇచ్చే స్తాయికి వెళ్తారు