అన్నదాతలకు గుడ్ న్యూస్ పీఎం కిసాన్ డబ్బులు ఖాతాలలో జమ అయ్యేది అప్పుడే?

కేంద్ర ప్రభుత్వం రైతులను దృష్టిలో పెట్టుకొని రైతులను ఆర్థికంగా ముందుకు నడిపించడం కోసం వారి వ్యవసాయ పనుల నిమిత్తం తన వంతు సాయంగా ప్రతి ఏటా ప్రతి ఒక్క రైతుకు ఆరువేల రూపాయలు చొప్పున రైతుల ఖాతాలో జమ చేస్తున్న విషయం మనకు తెలిసిందే..పీఎం కిసాన్ సన్ ఇది యోజన పథకం ద్వారా ప్రతి ఏడాది మూడు విడుదలగా రైతుల ఖాతాలో 2000 రూపాయలు చొప్పున నగదును జమ చేస్తున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే 12 విడుదలగా ₹2,000 చొప్పున రైతుల ఖాతాలో పిఎం కిసాన్ ని డబ్బులు జమయ్యాయి ఇక 13వ విడత డబ్బులను కూడా విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. 13వ విడత హోలీలోపు రైతుల ఖాతాలోకి వస్తుందని భావిస్తున్నారు. త్వరలో 13వ విడత విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ పథకాన్ని ఫిబ్రవరి 24, 2019న ప్రారంభించింది మోడీ సర్కార్‌. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఫిబ్రవరి 24వ తేదీకి ఈ పథకం ప్రారంభించిన నాలుగు సంవత్సరాలు పూర్తి కానుంది.

ఇక ఈ పథకం ప్రారంభించిన నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకోనున్న సందర్భంగా ఫిబ్రవరి 24వ తేదీ 13వ విడత పిఎం కిసాన్ డబ్బులు రైతుల ఖాతాలో జమ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి అయితే దీని గురించి ఎలాంటి అధికారక ప్రకటన లేకపోయినా అదే రోజున రైతుల ఖాతాలో డబ్బు జమ చేయబోతున్నట్లు సమాచారం.ఇదివరకు పిఎం కిసాన్ డబ్బులను 13వ విడత హోలీ పండుగ పురస్కరించుకొని రైతుల ఖాతాలో జమ చేయబోతున్నారని వార్తలు వచ్చాయి కానీ ఈ పథకం ప్రారంభించిన నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఫిబ్రవరి 24వ తేదీని ఈ డబ్బులు రైతుల ఖాతాలో జమ కానున్నట్టు తెలుస్తోంది అయితే ఇప్పటివరకు దీని గురించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు..