ఉద్యోగస్తులకు శుభవార్త..అధిక పెన్షన్‌ కోసం ఎలా అప్లై చేసుకోవాలంటే..?

ప్రస్తుత కాలంలో ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికి పీఎఫ్ అకౌంట్ తప్పకుండా ఉండాలి. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులందరూ ప్రతినెల వారి జీతం నుండి కొంత మొత్తం ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ లో పొదుపు చేస్తారు. ఇలా పొదుపు చేసిన డబ్బును భవిష్యత్తు కోసం ఉపయోగించవచ్చు. ప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఇటీవల కొత్త ఆప్షన్ తీసుకొచ్చింది. ఈపీఎఫ్‌ పరిధిలోకి వచ్చే కార్మికులు, ఉద్యోగులు, పింఛనుదారులు అధిక పింఛను పొందేందుకు యజమానితో కలిసి ఉమ్మడి ఆప్షన్‌ ఇచ్చేందుకు ఈపీఎఫ్‌వో ఆన్‌లైన్ లో దరఖాస్తును అందుబాటులోకి తెచ్చింది.

ఉద్యోగుల పింఛను పథకం -1995 చట్టసవరణకు ముందుగా ఈపీఎఫ్‌ చందాదారుగా చేరినవారు అధిక పించన్ పొందటానికి అర్హులు. అంతే కాకుండా చందాదారులుగా చేరి.. ఆ తరువాత సర్వీసులో కొనసాగుతూ అధిక వేతనంపై ఈపీఎఫ్‌ చందాచెల్లిస్తూ కూడా ఈపీఎస్‌ చట్టంలోని 11(3) కింద ఉమ్మడి ఆప్షన్‌ ఇవ్వలేకపోయిన వారు అర్హులుగా సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. ఉద్యోగస్తులు యజమానితో కలిసి ఉమ్మడి ఆప్షన్‌ ఇచ్చేందుకు 3వ తేదీ చివరి గడువుగా వెల్లడించింది. ఈ గడువులోగా అర్హులైన ఉద్యోగులు, కార్మికులు, వేతనజీవులు ఉమ్మడి ఆప్షన్‌ నమోదు చేయాలని స్పష్టం చేసింది.

ఉద్యోగస్తులు, పింఛనుదారులు, అధిక పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఈపీఎఫ్‌ మెంబర్‌పోర్టల్‌ హోంపేజీలో ప్రత్యేక లింకును ఈపీఎఫ్‌వో ఆదివారం అర్ధరాత్రి ఏర్పాటు చేసింది.
• అధిక పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి హోంపేజీలో అప్లికేషన్‌ ఫర్‌ జాయింట్‌ ఆప్షన్‌ లింకును క్లిక్‌ చేయాలి.
• ఆ తరువాత ఈపీఎస్‌ చట్టం 11(3) కింద ఆప్షన్‌కు దరఖాస్తును క్లిక్‌ చేయాలి.
• ఈ దరఖాస్తును భవిష్యనిధి యూనివర్సల్‌ అకౌంట్‌ నంబరు ఖాతాద్వారా పూర్తిచేయాలి.
• చందాదారు ఆధార్‌ నంబరు, పుట్టిన తేదీ వివరాలు ఈపీఎఫ్‌వో రికార్డుల ప్రకారం నమోదు చేసి.. లాగే ఆధార్‌తో అనుసంధానమైన మొబైల్‌ నంబరు కూడా నమోదు చేయాలి
• నాలుగు దశల్లో వివరాలు పూర్తిచేశాక దరఖాస్తు నంబరు వస్తుంది. ఇలా అధిక పింఛన్ కోసం ధరకాస్తు చేసుకోవచ్చు.