ఎస్బిఐ అందిస్తున్న ఈ స్కీమ్ తో డబుల్ బెనిఫిట్స్..?

sbi-3-1-2-167419588016x9

దేశవ్యాప్తంగా ఎన్నో బ్యాంకింగ్ సంస్థలు ప్రజలకు తమ సేవలను అందిస్తున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థల్లో ఒకటైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా దేశవ్యాప్తంగా తమ సేవలను అందిస్తోంది. ఎస్బిఐ తన కస్టమర్ల కోసం ఇప్పటికే వివిధ రకాల స్కీమ్స్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ స్కీమ్స్ ద్వారా కస్టమర్లు ఎన్నో ప్రయోజనాలు పొందుతున్నారు. తాజాగా ఎస్బిఐ మరొక ఎఫ్డి స్కీమ్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ స్కీం ద్వారా కస్టమర్లు అధిక వడ్డీ బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంటుంది. ఎస్బిఐ ప్రవేశపెట్టిన ఈ కొత్త స్కీం టెన్యూర్, వడ్డీ రేటు గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఎస్‌బీఐ తాజాగా 400 రోజుల టెన్యూర్‌తో కస్టమర్ల కోసం కొత్త ఎఫ్‌డీ స్కీమ్‌ను తీసుకువచ్చింది. ఫిబ్రవరి 15 నుంచి ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది. అయితే ఈ స్కీమ్ 2023 మార్చి 31 వరకే అందుబాటులో ఉంటుందని ఎస్బిఐ వెల్లడించింది. ఈ ఎఫ్‌డీ స్కీమ్‌లో చేరిన కస్టమర్లకు 7.1 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. తాజాగా ఎస్బిఐ వడ్డీ రేట్లను పెంచేసినట్లు తెలుస్తుంది. అలాగే ఎఫ్‌డీ రేట్లు కూడా 5 బేసిస్ పాయింట్ల నుంచి 25 బేసిస్ పాయింట్ల వరకు పెరిగాయి. ఇక మూడేళ్ల నుంచి పదేళ్ల వరకు ఉన్న టెన్యూర్‌లోని ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 6.25 శాతం నుంచి 6.5 శాతానికి పెరిగింది. అయితే రెగ్యులర్ కస్టమర్లకు మాత్రమే ఈ వడ్డీ రేట్లు వర్తిస్తాయని ఎస్బిఐ వెల్లడించింది.

ఐదేళ్ల నుంచి పదేళ్ల వరకు టెన్యూర్‌లోని ఎఫ్‌డీ లపై కూడా వడ్డీ రేటు 7.25 శాతం నుంచి 7.5 శాతానికి పెరిగింది. అంతే కాకుండా సీనియర్ సిటిజన్స్‌ కోసం ఉయ్ కేర్ డిపాజిట్ పథాకాన్ని ఎస్బిఐ ప్రవేశపెట్టింది. అంతేకాదు 50బేసిస్ పాయింట్లను కూడా సొంతం చేసుకోవచ్చు. ఆర్.బి.ఐ రెపోరేటు పెరగటంతో హోమ్ లోన్, వెహికల్ లోన్ వంటి వాటిపై వడ్డీ రేట్లు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్బిఐ రెపో రేటు పెరగడం వల్ల అన్ని బ్యాంకులు కూడా రుణ రేట్లు, ఎఫ్‌డీ రేట్లు పెంచుకుంటూ వస్తున్నాయి. ఇప్పుడు ఎస్‌బీఐ కూడా ఈ బ్యాంకుల జాబితాలోకి చేరి వడ్డీ రేట్లు,ఎఫ్‌డీ రేట్లు పెంచింది.