భాగస్వామి పేరుపై ఏటా రూ. 1.5 లక్షలు ఇన్వెస్ట్ చేసి.. రూ. 40 లక్షలు పొందవచ్చు..?

ఆర్థికంగా ప్రజలను ఆదుకోవటానికి కేంద్ర ప్రభుత్వ ఇప్పటికి ఎన్నో పథకాలను అందులోకి తీసుకువచ్చింది. ఈ పథకాల ద్వారా ప్రజలు తమ భవిష్యత్తు కోసం డబ్బు పొదుపు చేసుకొని అవకాశం కల్పిస్తోంది. ఈ పథకాల ద్వారా డబ్బు పొదుపు చేసి అధిక వడ్డీతో మరింత లాభం పొందవచ్చు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఇటువంటి ఎన్నో పథకాలను అమలులోకి తీసుకువచ్చింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాలలో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎటువంటి రిస్క్ లేకుండా లాభం పొందవచ్చు. భారత ప్రభుత్వం అందిస్తున్న సేవింగ్ స్కీమ్స్‌లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ కూడా ఒకటి. ఈ స్కీం లో చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి.

ఈ స్క్రీన్ ద్వారా డబ్బులు ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు దగ్గరలోని పోస్ట్ ఆఫీస్ కి లేదా బ్యాంకుకు వెళ్లి అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన వారికి ట్యాక్స్ బెనిఫిట్స్ తో పాటు ఈఈఈ ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది. ప్రతి ఆర్థిక సంవత్సరం ఈ స్కీమ్ లో రూ. 1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఆదాయపు పన్ను చట్టం లోని సెక్షన్ 80 సీ కింద రూ. 1.5 లక్షల వరకు ట్యాక్స్ బెనిఫిట్స్ ని పొందేందుకు అవకాశం ఉంటుంది. ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేయలేని వారు ప్రతి ఏటా రూ. 500 ఇన్వెస్ట్ చేసినా కూడా ప్రయోజనం పొందవచ్చు.

ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలం 15 సంవత్సరాలు. అంటే ఈ స్కీం లో చేరిన వారు 15 సంవత్సరాల పాటు డబ్బులు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. 15 సంవత్సరాల తర్వాత వారు ఇన్వెస్ట్ చేసిన మొత్తానికి వడ్డీతో కలిపి లాభం పొందవచ్చు. ఒకవేళ అంతకన్నా ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలనుకునేవారు 15 సంవత్సరాల తర్వాత కూడా మెచ్యూరిటీ కాలాన్ని ఎక్స్టెండ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇలా ఐదేళ్ల స్కీమ్ మెచ్యూరిటీ కాలం పొడిగించుకోవచ్చు. ఇక ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన మొత్తానికి 7.1 శాతం వడ్డీ రేటు వస్తుంది. అయితే ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ రేట్లు మారవచ్చు. ముఖ్యంగా భార్య పేరు పై కూడా పీపీఎఫ్ ఖాతా ఓపెన్ చెయ్యచ్చు. మీ భాగస్వామి పేరుపై మీరు ఏటా రూ. 1.5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే.. అప్పుడు మెచ్యూరిటీ సమయంలో దాదాపు రూ. 40 లక్షలు లభిస్తాయి. ఇలా ఈ స్కీమ్ తో ఎటువంటి రిస్క్ లేకుండా చక్కటి లాభాలని పొందొచ్చు.