నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు.. భారీ వేతనంతో ఎల్ఐసీలో ఉద్యోగ ఖాళీలు!

దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. అన్నమయ్య జిల్లా కడప కోటిరెడ్డి సర్కిల్ దగ్గర జాబ్ మేళాను నిర్వహిస్తుండగా ఎల్ఐసి, బైజుస్ కంపెనీలతో పాటు యాక్సిస్ బ్యాంక్ ఇంటర్వ్యూలను నిర్వహిస్తోందని తెలుస్తోంది. 18 నుంచి 35 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారని తెలుస్తోంది.

ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 10,000 రూపాయల నుంచి 37,000 రూపాయల వరకు వేతనం లభించనుందని సమాచారం అందుతోంది. నిరుద్యోగులకు ఈ జాబ్  మేళా ద్వారా ప్రయోజనం చేకూరనుంది. పది నుంచి డిగ్రీ వరకు చదివిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సులువుగా జాబ్ కు ఎంపికయ్యే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు.

భారీ వేతనంతో ఎల్ఐసీలో ఉద్యోగ ఖాళీలు ఉన్న నేపథ్యంలో ఎల్ఐసీలో ఉద్యోగం కావాలని కోరుకునే వాళ్లు వెంటనే ఈ జాబ్ మేళా పై దృష్టి పెడితే మంచిది. యాక్సిస్ బ్యాంక్, బైజూస్ లో ఉద్యోగం చేయాలని ఎంతోమంది కలలు కంటున్నారు. ఈ కంపెనీలలో చాలా కంపెనీలు ప్రముఖ కంపెనీలు కావడంతో ఈ ఉద్యోగ ఖాళీల కోసం పోటీ ఎక్కువగానే ఉంటుందని చెప్పవచ్చు.

ఈ నెల 30వ తేదీన ఉదయం 9.30 గంటలకు ఈ జాబ్ మేళాను నిర్వహించనున్నారని సమాచారం అందుతోంది. ఉపాధి కార్యాలయంలో ఈ జాబ్ మేళాను నిర్వహించనుండగా అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు వెంటనే ఈ జాబ్ మేళాకు దరఖాస్తు చేసుకుంటే మంచిది.