రూ.1,37,220 వేతనంతో టీటీడీలో భారీగా ఉద్యోగ ఖాళీలు.. మంచి వేతనంతో?

తిరుమల తిరుపతి దేవస్థానం నిరుద్యోగులకు తీపికబురు అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం టీటీడీ జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు రూ.1,37,220 వేతనం లభించనుంది. 50కు పైగా ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో మొత్తం 56 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి.

బిఈ సివిల్., మెకానికల్ చదివిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. వేర్వేరు ఉద్యోగ ఖాళీలు ఉండగా 42 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. www.tirumala.org వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

నవంబర్ 23వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు హిందూ మతానికి చెందిన వాళ్లై ఉండాలి. రోస్టర్ పాయింట్లు, వయస్సు, పేస్కేలు, క్వాలిఫికేషన్స్, ఇతర నియమ నిబంధనల ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.

వెబ్ సైట్ ద్వారా ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఇతర వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు భారీ వేతనం లభిస్తుండటంతో అర్హత ఉన్నవాళ్లకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా మేలు జరగనుంది.