‘2.0’ఆశ్చర్యపరిచే వార్త: శంకర్ కెరీర్ లో తొలిసారి!

సూపర్‌స్టార్‌ రజనీకాంత్, బాలీవుడ్‌స్టార్‌ అక్షయ్‌ కుమార్‌లు కలిసి నటిస్తున్న చిత్రం ‘2.0’.ఈ చిత్రం రిలీజ్ కు సిద్దపడుతున్న నేపథ్యంలో ఆశ్చర్యకరమైన విషయాలు ఒక్కోటి బయటికొస్తున్నాయి. సైన్స్ ఫిక్షన్ సబ్జెక్టుతో శంకర్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమానవంబరు 29న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలకు సిద్ధమౌతోంది. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు ఉన్న విపరీతమైన క్రేజ్‌ నేపథ్యంలో ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో రికార్డ్ లు క్రియేట్ చేయటం ఖాయమనేది ఖాయమైపోయింది.

రిలీజ్ టైమ్ దగ్గరపడటంతో ఈ సినిమా సెన్సార్‌ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు.ఇక ఈ చిత్రం లెంగ్త్ విషయానికి వస్తే కేవలం 2.28 గంటలు (148 నిమిషాలు) మాత్రమే ఉండటం అందరినీ ఆశ్చర్యనానికి గురి చేస్తోంది. దర్శకుడు శంకర్‌ సినీ కెరీర్‌లో అతి తక్కువ నిడివి ఉన్న సినిమా ఇదే కావటం విశేషం.

గతంలో విక్రమ్‌ హీరోగా తెరకెక్కించిన ‘ఐ’చిత్రం 188 నిమిషాల రన్‌టైమ్‌తో శంకర్‌ కెరీర్‌లోనే ఇప్పటి వరకు అతి ఎక్కువ నిడివి ఉన్న చిత్రంగా ఉంది. 167 నిమిషాల నిడివితో ‘రోబో’ అతి చిన్న సినిమాగా నిలిచింది. ఇప్పుడు ‘రోబో’ స్థానంలో ‘2.0’ చేరింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ స్క్రీన్లపై ‘2.ఓ’ను విడుదల చేయడానికి దర్శక, నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. తిరుచ్చిలోని వివిధ స్క్రీన్లలో ఉదయం 4.30 నుంచి 9 గంటలలోపు 20 కన్నా ఎక్కువ షోలను వేయాలని పంపిణీదారులు భావిస్తున్నారట. దుబాయ్‌లోని అతిపెద్ద మల్టీప్లెక్స్‌ VOX సినిమాస్‌లో ‘2.ఓ’ను రోజుకు 100 షోల కంటే ఎక్కువ ప్రదర్శించడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

సైంటిస్ట్‌ వశీకరణ్‌, రోబో చిట్టి పాత్రలే కాకుండా మరో మూడు పాత్రల్లో రజనీ నటిస్తుండగా, రావణుడి తరహాలోనే అక్షయ్‌ కుమార్‌ ఏకంగా 10 పాత్రల్లో కనిపి స్తారని చెప్పుకుంటున్నారు. టెక్నాలజీపరంగా చూస్తూ 2డి, 3డి, ఐమాక్స్‌ 3డి, ఐమాక్స్‌ రియల్‌ 3డి ఫార్మాట్లలో డాల్బీ అట్మాస్‌ కంటే ఉత్తమమైన సౌండ్‌ టెక్నాలజీతో ‘2.0’ను తీర్చి దిద్దుతున్నారు శంకర్‌.2.0 నవంబ‌ర్ 29న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది.