సమస్యలతో సతమతమవుతున్నారా.. స్నానం చేసే నీటిలో వీటిని కలిపితే చాలు!

సాధారణంగా ఒక మనిషి జీవితం ఎన్నో ఒడిదుడుకులతో నిండి ఉంటుంది. చీకటి వెలుగులాగా మన జీవితంలో కూడా కష్టాలు సంతోషాలు రావడం సర్వసాధారణం. అయితే చాలామంది నిత్యం ఏదో ఒక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఎంతో బాధపడుతూ ఉంటారు. ఇలా ఆర్థిక సమస్యలు కానీ లేదా అనారోగ్య సమస్యలు కానీ వెంటాడుతూ ఉన్నట్లయితే అలాంటి వారు స్నానం చేసే నీటిలో వీటిని కలిపి స్నానం చేస్తే కష్టాలన్నీ మటుమాయం అవుతాయి.

సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం జాతకంలో ఉన్న శుక్ర గ్రహం యొక్క స్థితిని బలోపేతం చేయడానికి ప్రతి శుక్రవారం స్నానం చేసే నీటిలో కాస్త పటిక కలపడం వల్ల వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతారు. ఇక ఎవరైతే బృహస్పతి దోషంతో బాధపడుతూ ఉంటారో అలాంటివారు గురువారం స్నానం చేసే నీటిలో పసుపు కలుపుకొని స్నానం చేయడం ఎంతో మంచిది. ఇక తరచూ మనం స్నానం చేసే నీటిలో గంధం కలుపుకొని స్నానం చేయటం వల్ల శుభవార్తలు వింటారు.

కష్టాలను అనుభవిస్తూ ఉంటే అలాంటి వారు స్నానం చేస్తే సమయంలో ఆ నీటిలో కాస్త పాలను కలిపి స్నానం చేయటం వల్ల కష్టాలన్నీ కూడా దూరమవుతాయి. ఇక ఎవరైతే రాహుకేతుదోషాలతో బాధపడుతూ ఉంటారో అలాంటి వారు స్నానం చేసే నీటిలో కాస్త కర్పూరం వేసి స్నానం చేయటం వల్ల రాహు కేతు దోషాలు తొలగిపోతాయి. ఇక మన జీవితంలో శాంతి శ్రేయస్సు వంటివి ఉండాలంటే స్నానపు నీటిలో పరిమళాన్ని వేసి స్నానం చేయడం వల్ల శాంతి శ్రేయస్సు కలుగుతాయి.