ప్రతిరోజు ఈ గింజలను తింటే.. ఈ వ్యాధులన్నీ పరార్?

గుమ్మడికాయలను పండగ సందర్భాల్లోనూ, ఇంటికి దిష్టి తీయడానికి మాత్రమే ఎక్కువగా ఉపయోగిస్తారున్న అపోహ చాలామందిలో ఉంటుంది. గుమ్మడికాయతో ఎన్నో రుచికరమైన వంటలు, స్వీట్లు తయారుచేస్తారు. ముఖ్యంగా గుమ్మడికాయ హల్వా ఎంతో ప్రసిద్ధిగాంచింది. గుమ్మడికాయ మరియు గుమ్మడి గింజల్లో మన శరీర పెరుగుదలకు మరియు ఆరోగ్యానికి అవసరమైన విటమిన్ సి, కే, కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం, బీటా కెరోటిన్, పోలేట్, ఫైబర్ వంటి అనేక పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. తరచూ గుమ్మడికాయను మన ఆహారంలో భాగం చేసుకుంటే అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనవచ్చు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా గుమ్మడికాయలో కంటే గుమ్మడి గింజల్లో రెట్టింపు పోషక పదార్థాలు ఔషధ గుణాలు ఉన్నాయనడంలో ఇటువంటి సందేహం లేదు. రోజుకు గుప్పెడు గుమ్మడి గింజలు తింటే వీటిల్లో పుష్కలంగా ఉండే విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కె మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంచి నీరసం ,అలసటను తొలగించి రోజంతా మనల్ని చురుగ్గా ఉంచుతుంది.

నిద్రలేమి సమస్యతో బాధపడే వారికి గుమ్మడి గింజలు ఔషధంగా పనిచేస్తాయి. మనకు సుఖప్రదమైన నిద్రను కలగజేసేది మెల‌టోనిన్ అనే హార్మోన్ గుమ్మడి గింజల్లో ఉండే ఔషధ గుణం మెల‌టోనిన్ అనే హార్మోన్ ను ఉత్తేజపరిచి మనకు సుఖప్రదమైన నిద్రను కలగజేస్తుంది. నిద్రపోయే ముందు కొన్ని గుమ్మడి గింజలు తినడం మంచి ఫలితాన్ని ఇస్తుంది.

షుగర్ వ్యాధిగ్రస్తులు ప్రతిరోజు కొన్ని గుమ్మడి గింజలు తినడం వల్ల వీటిలో పుష్కలంగా ఉండే మెగ్నీషియం, ఫైబర్ రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించి ఇన్సులిన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

గుమ్మడికాయ గింజల్లో క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడే ఔషధ గుణాలు ఉంటాయి. కావున గ్యాస్ట్రికి, ప్రోస్టేట్, పెద్ద పేగు కేన్సర్ల నుండి విముక్తి కలిగిస్తుంది.

రక్తహీనత సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు కొన్ని గుమ్మడి గింజలను ఆహారంగా తీసుకుంటే వీటిల్లో పుష్కలంగా ఉండే ఐరన్, ఫోలేట్, బీటా కెరోటిన్, విటమిన్ ఇ రక్తంలోని హిమోగ్లోబిన్ ఉత్పత్తిని పెంచి రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.

పని ఒత్తిడి, డిప్రెషన్ తో బాధపడేవారు గుమ్మడి గింజలను తినడం వల్ల వీటిలో అధికంగా ఉండే మెగ్నీషియం నాడి వ్యవస్థ పనితీరును ప్రభావితం చేస్తుంది. మెగ్నీషియం అధికంగా ఉండడం గుండె పనితీరును మెరుగుపరిచి అధిక రక్తపోటు సమస్యను నివారిస్తుంది.

గుమ్మడి గింజలు తక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది. మోతాదుకు మించి తింటే కడుపులో మంట, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్నవాళ్లు, చిన్నపిల్లలు, గర్భవతులు వీటిని తినకుండా ఉండడం మంచిది.