ఈ కషాయాన్ని సేవిస్తే… కిడ్నీ సమస్యలన్నిటికీ చెక్ పెట్టొచ్చు?

భారతీయ ఆయుర్వేద వైద్యంలో అటీక మామిడి తీగ మొక్కకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ మొక్కలోని వేర్లు ,ఆకులు, కాండం మొత్తం ఎన్నో ఔషధ గుణాలతో నిండి ఉండి అనేక వ్యాధులను నయం చేయడంలో సహాయపడుతుంది. ప్రకృతి సిద్ధంగా మన పరిసరాల్లో సమృద్ధిగా పెరిగి పల్లె ప్రజలకు సుపరిచితమైన మొక్క అటిక మామిడి తీగ మొక్క .ఈ మొక్కని కొన్ని ప్రాంతాల్లో అంటుడు కాయ మొక్క అని కూడా పిలుస్తారు. ఈ మొక్క శాస్త్రీయ నామం బొహేవియా.
ఈ మొక్కని పురాతన సంస్కృత గ్రంథాల్లో పునర్వవగా పిలవడం జరిగింది.

ఎన్నో సహజ ఔషధ గుణాలతో నిండి ఉన్న అటిక మామిడి తీగ మొక్క మన శరీరంలోని వ్యాధి కారక కణాలను నశింపజేసి శరీర పనితీరును మెరుగుపరచడం తో పాటు ప్రతి అవయవాన్ని రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అటిక మామిడి తీగ మొక్కను ఆకుకూరగా ఫ్రై చేసుకొని తినవచ్చు లేదా కషాయంగా చేసుకొని తాగినా మంచి ఫలితం ఉంటుంది. కషాయం ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

తాజా అటిక మామిడి మొక్కలోని ఆకులు, పువ్వులు, వేర్లతో సహా సన్నని ముక్కలుగా తరిగి ఐదు లేదా పది నిమిషాలు 200 మి.లీ. నీటిలో మరిగించాలి. బాగా మరిగిన తర్వాత వడగట్టుకుని రసాన్ని మాత్రమే తీసుకొని ప్రతి రోజు ఉదయం పరగడపున 50 మి.లీ కషాయాన్ని తాగితే ఈ మొక్కలోని ఔషధ గుణాలు మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించి సర్వరోగ నివారిణిగా పనిచేస్తుంది.

ముఖ్యంగా కిడ్నీ సమస్యలతో బాధపడేవారు అటిక మామిడి తీగ కషాయాన్ని ప్రతిరోజు పరగడపున 50 మి.లీ సేవిస్తే అటిక మామిడి తీగ మొక్క దివ్య ఔషధంలా పనిచేస్తుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడినా, కిడ్నీలు పాడైపోయిన డయాలసిస్ వరకు వచ్చిన వారి ప్రాణాలను సైతం అటిక మామిడి రసంతో రక్షించవచ్చనని పురాతన ఆయుర్వేద వైద్యం చెబుతోంది .అలాగే ఇప్పటి వైద్య నిపుణులు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నారు.