నీళ్లను తాగే విషయంలో అశ్రద్ధ వహిస్తే .. ఎలాంటి సమస్యలను ఎదుర్కోవాలో తెలుసా?

ప్రతిరోజు నీళ్లను తాగే విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు చాలా సందర్భాల్లో తెలియజేయడం జరిగింది. సాధారణంగా మనందరం దాహం వేస్తున్నప్పుడు మాత్రమే నీళ్లను తాగడానికి ప్రయత్నం చేస్తాం ఈ అలవాటు సరైనది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. మనకు దాహం వేస్తుంది అంటే మన శరీరం అప్పటికే భారీగా నీటి శాతాన్ని కోల్పోయిందని అర్థం. మన ఒంట్లో నీటి శాతం తగ్గితే డిహైడ్రేషన్ సమస్య తలెత్తి ఒంట్లో ప్రతి అవయవం పనితీరు దెబ్బతింటుంది దాంతో అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.మనకు దాహం వేయకపోయినా వీలైనప్పుడల్లా ఒక గ్లాసుడు మంచినీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి.

మన నిత్య జీవక్రియలకు ఎంత నీరు అవసరము,
మంచినీళ్లు తాగే విషయంలో అశ్రద్ధ వహిస్తే ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా రోజుకు మనం ఎనిమిది లీటర్ల నీటిని తప్పనిసరిగా తాగాల్సి ఉంటుంది అయితే ఈ నియమం అన్నీ కాలాల్లోనూ అందరికీ ఒకేలాగా వర్తించదు. ఉదాహరణకు వేసవికాలంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా మన శరీరం ఎక్కువ నీటిని కోల్పోతుంది కాబట్టి అధిక మోతాదులో నీళ్లు తప్పనిసరిగా తాగాల్సిందే. అలాగే అధిక శారీరక శ్రమ కలిగిన వారు, అత్యధిక ఉష్ణోగ్రతల వద్ద పనిచేసేవారు ఒంట్లో నీటిని చెమట రూపంలో అత్యధికంగా కోల్పోతారు కావున వీరికి 8 లీటర్ల నీళ్లు సరిపోవు అంతకంటే ఎక్కువగా తప్పనిసరిగా తాగాలి.

మన ఒంట్లో నేటి శాతాన్ని అధికంగా కోల్పోయాము అన్న దానికి సూచకంగా మన మూత్రాన్ని పరీక్షించవచ్చు సాధారణంగా మూత్రం లేత పసుపు రంగులో ఉంటుంది. అదే మూత్రం ముదురు పసుపు రంగులో ఉంటే మనం డిహైడ్రేషన్ సమస్యను ఎదుర్కొంటున్నామని గుర్తించవచ్చు. ఉదయం నిద్ర లేవగానే ఓ గ్లాసుడు మంచినీళ్లు తాగితే మన శరీరంలో ఉన్న అన్ని అవయవాలకు తగినంత నీటి నిల్వలు లభించి నిత్య జీవక్రియలు సాఫీగా సాగిపోతాయి. ఉదయం సాయంత్రం ఎక్ససైజ్ రన్నింగ్ వాకింగ్ వంటి అలవాట్లు ఉన్నవారు గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసాన్ని కలిపి సేవిస్తే వీటిలో పుష్కలంగా ఉన్న విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. అలసట, తలనొప్పి, కళ్ళు తిరగడం వంటి సమస్యలు తలెత్తినప్పుడు మీరు డిహైడ్రేషన్ సమస్యలతో బాధపడుతున్నారని అర్థం చేసుకోవాలి వెంటనే ఒక గ్లాసుడు మంచినీళ్లు తాగితే కొంత ఉపశమనం కలిగిస్తుంది. శరీరంలో నీటి శాతం తగ్గితే జీర్ణ వ్యవస్థ పనితీరు మందగిస్తుంది దాంతో మలబద్దక సమస్య ఏర్పడుతుంది. నీళ్లను తక్కువగా తాగే వారిలో కిడ్నీ ఇన్ఫెక్షన్ తలెత్తి కిడ్నీలో రాళ్లు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కావున మనకు దాహంగా లేనప్పటికీ వీలైనప్పుడల్లా తప్పనిసరిగా ఒక గ్లాసుడు మంచినీళ్లు తాగడం మంచిది.