వేసవికాలం వచ్చింది కదా అని ప్రతిరోజు ఉదయం నిమ్మరసం తాగుతున్నారా… ఇది తెలుసుకోవాల్సిందే!

ఇంకా వేసవికాలం సరిగా మొదలుకాకుండానే బాణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. వేసవికాలం ప్రారంభమైన మొదట్లోనే ఎండలు దంచి కొడుతున్నాయి.ఇలా వేసవి తాపం అధికం కావడంతో వాతావరణంలో ఉష్ణోగ్రతలు కూడా మారిపోయాయి. ఇలా ఎండ వేడి అధికమవడంతో చాలామంది తొందరగా డిహైడ్రేషన్ కి గురయ్యే ప్రమాదం ఉంది. ఇలా ఎండ వేడి నుంచి రక్షణ పొంది శరీరాన్ని డిహైడ్రేషన్ సమస్యకు గురి కాకుండా ఉంచుకోవడానికి ఇప్పటినుంచి ప్రతిరోజు కొన్ని ఆహార నియమాలను అలవాటు చేసుకోవాలి. ఈ ఎండాకాలం మొత్తం సులువుగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలను తీసుకోవడంతోపాటు శరీరానికి తగిన నీటి శాతాన్ని అందించి ఆరోగ్యవంతమైన పానీయాలను ఎక్కువగా తాగాలి.

మనందరికీ అందుబాటులో ఉండే నిమ్మ కాయతో ప్రతిరోజు ఉదయాన్నే రుచికరమైన నిమ్మ పానీయాన్ని తయారు చేసుకొని సేవిస్తే నిమ్మకాయలో ఉండే 53 మిల్లీగ్రాముల విటమిన్ సి,9 గ్రాముల కార్బోహైడ్రేట్స్ తక్షణ శక్తిని ఇవ్వడంలో సహాయపడి రోజంతా మిమ్మల్ని అలసిపోనివ్వకుండా శరీరంలోని లవణాలను కోల్పోనివ్వకుండా వడదెబ్బ నుంచి రక్షిస్తాయి.
వేసవికాలంలో జీర్ణశక్తి తక్కువగా ఉంటుంది కావున ప్రతిరోజు నిమ్మ రసాన్ని సేవిస్తే జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.

నిమ్మకాయలు సమృద్ధిగా ఉండే విటమిన్ ఏ, యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని తొందరగా పొడివారనివ్వదు తద్వారా చర్మం మృదువుగా తయారవుతుంది.ప్రతిరోజు నిమ్మ రసాన్ని సేవిస్తే ఇందులో ఉండే విటమిన్ సి, సిట్రిక్ యాసిడ్లు మనం తీసుకునే ఆహారంలో ఐరన్ ను సమృద్ధిగా గ్రహించి రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి ప్రమాదకర రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది. దాంతో అలసట, నీరసం, కళ్ళు తిరగడం, తలనొప్పి వంటి అనేక సమస్యలు తొలుగుతాయి.అంతేకాకుండా మన శరీరం డిహైడ్రేషన్ కి గురికాకుండా మన శరీరంలో జీవక్రియలకు సరిపడా శక్తిని కూడా అందిస్తుంది అందుకే ప్రతిరోజు ఒక గ్లాస్ తాగడం ఎంతో మంచిది మంచిది కదా అని అధికంగా తీసుకోవడం వల్ల ఇతర సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.