మీడియాకు ఎప్పుడూ మేత కావాలి. తన వెబ్ సైట్స్ లేదా తమ ఛానెల్స్ లో క్రేజీ వార్తలు కోసం వెతుకుతూ, ఒక్కోసారి ఏ హాట్ న్యూస్ దొరకకపోతే క్రియేట్ చేస్తూంటుంది. ఇప్పుడు ప్రభాస్ పైన అలాంటి వార్తే క్రియేట్ చేసారంటున్నారు. అదేమిటంటే..రాజమౌళి రూపొందిస్తున్న ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో ప్రభాస్ వాయిస్ ఓవర్ ఇవ్వటమే కాక, ఈ సినిమాలో ఓ కీల్ లో నటిస్తున్నాడంటూ వార్తలు మొదలయ్యాయి. అయితే అలాంటిదేమీ లేదని ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటన్నారు. ఇప్పుడీ వార్త వలన ఐడియా వచ్చి ఏమన్నా వాయిస్ ఓవర్ చెప్పించాలేమో కానీ నిజానికి అలాంటి ఆలోచన ఇప్పటిదాకా లేదని చెప్తున్నారు.
ఇక ‘ఆర్.ఆర్.ఆర్’లో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరో లుగా నటిస్తున్నారు. ఆలియా భట్ హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాలో …అల్లూరి సీతా రామరాజుగా చరణ్, కొమరం భీమ్గా ఎన్టీఆర్ కనిపించనున్నారు. ఎన్టీఆర్ కు జోడీగా అనుకున్న …బ్రిటిష్ నటి డైసీ ఎడ్గార్జోన్స్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్న తర్వాత ఆమె పాత్రలో సరిపోయే నటి కోసం దర్శక, నిర్మాతలు చూస్తున్నారు. నిత్యా మేనన్ సైతం ఈ సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం.
అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ కీలక పాత్రలో కనిపించన్నారు. ఎమ్.ఎమ్. కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది జులై 30న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.