‘సాక్షి’ యాంకర్ గా రేణు దేశాయ్…వెనుక ఉన్నదెవరు?

రేణుదేశాయ్ కూర్చోవ‌డానికి ఇబ్బంది ప‌డిన‌ వేళ‌

రేణు దేశాయ్ అందర్ని ఒక్కసారిగా ఆశ్చర్యపరిచారు. ఆమె ఇప్ప‌టికే టీవీల్లో రకరకాల పోగ్రామ్ లలో ద‌ర్శ‌న‌మిచ్చారు. ఎంట‌ర్‌టెయిన్‌మెంట్ చానెల్స్‌ల‌లో సెల‌బ్రిటీ యాంక‌ర్‌గా, జ‌డ్జిగా క‌నిపించారు. కానీ ఆమె స‌డెన్‌గా ఒక న్యూస్ ఛానెల్ యాంక‌ర్‌గా మార‌డం మాత్రం ఊహించని పరిణామమే. రేణు దేశాయ్ గ‌తంలో ఇపుడు ఎన్నిక‌ల వేళ‌..ఆమె సాక్షి టీవీలో న్యూస్ ప్రోగ్రామ్ హోస్ట్‌గా ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు.

“మ‌ట్టి మ‌నుషులు” అనే ప్రోగ్రామ్‌ని ఆమె సాక్షి టీవీ కోసం నిర్వ‌హించ‌నున్నారు. ఒక‌వైపు, జ‌న‌సేనాని పవన్ కళ్యాణ్ లో క‌ర్నూలులో రోడ్ షో నిర్వ‌హిస్తున్న వేళ‌, ఆయ‌న మాజీ భార్య సాక్షి టీవీ కోసం మ‌ట్టి మ‌నుషులు కార్య‌క్ర‌మాన్ని క‌ర్నూలు జిల్లాలోనే షూట్ చేస్తున్నారు.

రేణు దేశాయ్ కర్నూలు లోనే సాక్షి మైకు పట్టుకొని కనిపించారు. అక్కడ ప్రజలని ఇంటర్వ్యూ చేస్తున్న వీడియోలు బయటికొచ్చాయ్. ఈ నేపథ్యంలో పవన్ కి పోటీగా రేణు దేశాయ్ ని వైసీపీ రంగంలోకి దించినట్టు ప్రచారం సైతం మొదలైంది. ఈ వ్యూహాన్ని ప్రశాంత్ కిషోర్ రచించినట్లు చెప్పుకుంటున్నారు.

పవన్ తన మాటలతో విపరీతంగా దాడి చేస్తున్న వైఎస్అఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ కు సంబంధించిన ఛానల్ లో రేణు దేశాయ్ ప్రత్యేక క్రార్యక్రమాలు నిర్వహించడం పవన్ అభిమానులకు కూడ అంతు పెట్టని విషయంగా మారింది.

రాజకీయాలలో సినిమాలలో శాశ్విత శత్రువులు మిత్రులు ఉండరు కాబట్టి రాబోయే రోజులలో పవన్ జగన్ ల కలయికకు రేణుదేశాయ్ సాక్షి యాంకర్ గా మారడం ఒక సంకేతమా అంటూ పవన్ అభిమానులు కూడ సందేహాలు వ్యక్తం పరుస్తున్నారు.