రేణు దేశాయ్ షాకింగ్ డెసిషన్ కు కారణం

రేణుదేశాయ్ కూర్చోవ‌డానికి ఇబ్బంది ప‌డిన‌ వేళ‌

రేణు దేశాయ్ షాకింగ్ డెసిషన్ కు కారణం

రేణు దేశాయ్ త్వరలో తెలుగులో ఓ సినిమా తో ఎంట్రీ ఇస్తుందని వార్తలు వచ్చాయి. బెల్లంకొండ శ్రీనివాస్ ప్రధాన పాత్రలో రూపొందే చిత్రంలో ఆమె కీ రోల్ లో కనిపించబోతోందని అన్నారు. దొంగాట చిత్రంతో దర్శకుడుగా పరిచయం అయిన వంశీ కృష్ణ ఈ చిత్రం డైరక్ట్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. వాస్తవిక సంఘటన ఆధారంగా మంచి మెసేజ్ తో ఉన్న ఆ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తే బాగుంటుందని రేణు సైతం భావించింది. ఇప్పటికే స్క్రిప్టు ..సాయి మాధవ్ బుర్రా డైలాగులతో పూర్తైంది. అయితే ఇప్పుడు మొత్తం సీన్ రివర్స్ అయ్యింది.ఈ ప్రాజెక్టునుంచి రేణు దేశాయ్ ఈ సినిమా నుంచి పక్కకు తప్పుకున్నట్టు సమాచారం.

ఈ నేపధ్యంలో రకరకాల రూమర్స్ మీడియాలో హల్ చేసాయి…. రేణు దేశాయ్ తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చే సినిమా దర్శక, నిర్మాతలకు పవన్ కళ్యాణ్ తీసుకోవద్దని చెప్పాడని కొందరన్నారు. అయితే పవన్ అంత దిగజారే మనిషి కాదని అందరికి తెలుసు కాబట్టి ఆ రూమర్ కు అంత ప్రయరిటి ఇవ్వలేదు. మరి చాలా కాలం తర్వాత తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వాలనుకున్న రేణు దేశాయ్.. ఎందుకు నో చెప్పిందనేది పెద్ద చర్చగా మారింది.

అందుతున్న సమాచారం మేరకు … రేణు దేశాయ్..తెలుగులో ఓ చిత్రం డైరక్ట్ చేసే ఆలోచన లో ఉన్నారు. రైతుల సమస్యలపై సాగే ఆ సినిమాతో తెలుగులో రీలాంట్ అయితే బెస్ట్ అని ఆమె భావిస్తున్నారట. ఈ సినిమా షూటింగ్ నిమిత్తం ఆమె హైదరాబాద్ సైతం తన మకాం మారుస్తున్నారని చెప్పింది. రేణు ఈ విషయమై మాట్లాడుతూ… త్వరలోనే తాను రైతుల సమస్యలతో సినిమా చేయబోతున్నానని.. నిర్మాతలతో చర్చల కారణంగా తాను హైదరాబాద్‌లో ఉండాల్సిన పరిస్థితులు వచ్చాయంది.