తన సినిమాని మేనల్లుడుకి ఇచ్చేసిన పవన్

కొద్ది కాలం క్రితం తమిళ్ నిర్మాత ఏ.ఎమ్ రత్నం తో పవన్ సినిమా చేయటానికి కమిటయ్యారు. నేశన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కించటానికి పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. కానీ ఆ తరువాత పవన్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం.. ఆ తర్వాత పూర్తిగా అందులోనే బిజీ అవ్వడం వల్ల సినిమా పట్టాలెక్కలేదు. దాంతో ఎఎమ్ రత్నం కూడా ఏమీ అనలేకపోయారు. కానీ పవన్ కు ఇచ్చిన అడ్వాన్స్ ని వెనక్కి అడిగి తీసుకోలేదట.

ఈ నేఫద్యంలో ఏ ఎమ్ రత్నంతో మాట్లాడి… తాను చేయాల్సిన ప్రాజెక్టును తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కు పవన్ ఆఫర్
చేయటానికి ఒప్పించినట్లు తెలుస్తోంది. అయితే పవన్ కు ఇచ్చిన అడ్వాన్స్ ..అవీ లెక్కేసుకుంటే సాయి కు వర్కవుట్ కాదు. కానీ పవన్ మీద అభిమానంతో ఓకే చేసారట. దాంతో ఏ.ఎమ్ రత్నం కూడా ఈ సినిమా తీయడానికి సరైన డైరెక్టర్ కోసం చూస్తున్నారని తెలుస్తోంది. అలాగని దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.

‘సుప్రీమ్’ తరువాత సాయి ధరమ్ తేజ్ కి సరైన హిట్ దక్కలేదు. ఈ చిత్రం తరువాత చేసిన 6 చిత్రాలు డిజాస్టర్లు కావడంతో తేజు మార్కెట్ బాగా పడిపోయింది . తాజాగా సాయి ధరమ్ నటిస్తున్న కొత్త చిత్రం ‘చిత్రలహరి’. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు. కిశోర్ తిరుమల తెరకెక్కిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో కళ్యాణి ప్రియదర్శన్ ,నివేత పేతురాజ్ హీరోయిన్స్ గా నటిస్తుండగా ప్రముఖ నటుడు సునీల్ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 12న విడుదలకానుంది.