అఖిల్,నాగ్ కలిసి తీసుకున్న నిర్ణయం,సరైనదేనా?

అఖిల్,నాగ్ కలిసి తీసుకున్న నిర్ణయం,సరైనదేనా?

ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న అక్కినేని అఖిల్ తన తదుపరి చిత్రానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఇందు నిమిత్తం ముగ్గురు దర్శకులు కథలు విన్నారట. అందులో ఇద్దరు ఆల్రెడీ సినిమా తీసినవాళ్ళు. ఒకళ్లు మాత్రం కొత్తవాడు. అయితే ఈ ముగ్గురు కథలు నచ్చినా, వాళ్లని వడపోసే కార్యక్రమం పెట్టుకుని ఫైనల్ నేరేషన్ వింటానని చెప్పాడట. అందులో భాగంగా ముగ్గురువి వరసపెట్టి విని చివరకు మొదట నుంచీ అనుకుంటున్న ప్రశాంత్ వర్మ నే ఫైనల్ చేసాడట.

అయితే రాజశేఖర్ తో కల్కి వంటి డిజాస్టర్ ఇచ్చిన ప్రశాంత్ వర్మ ప్రాజెక్టు ఉంటుందని ఎవరూ ఊహించలేదు. ఏదో రూమర్ అనుకున్నా…అతను కథ చెప్పిన విధానం, క్లైమాక్స్ ట్విస్ట్ ..అఖల్ కు బాగా నచ్చాయట. నాగ్ కూడా విని ఓకే చేసారట. దాంతో ఆ ప్రాజెక్టే పట్టాలు ఎక్కనుంది. అదొక లవ్ స్టోరీ అని తెలుస్తోంది. మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి ఈ సినిమాని డైరక్ట్ చేయనున్నారు. త్వరలోనే ఈ మేరకు ప్రకటన రానుందని తెలుస్తోంది. నిరంజన్ రెడ్డి …ఆల్రెడీ చిరు, కొరటాల శివ చిత్రం కో ప్రొడ్యూస్ చేస్తున్నారు.

అక్కినేని అఖిల్ కొత్త సినిమా ఈమధ్యే ప్రారంభమైన సంగతి తెలిసిందే. అఖిల్ కెరీర్ లో హీరోగా ఇది నాలుగవ చిత్రం. జీఎ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ రీసెంట్ గానే మొదలు అయ్యింది. పెద్దగా బ్రేక్స్ లేకుండా షూటింగ్‌ను చకచకా పూర్తి చేయాలని ఫిల్మ్‌మేకర్స్ ప్లాన్ చేసుకున్నారట. ఈ ఏడాదిలోనే సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లానింగ్ జరుగుతోందని తెలిసింది.