‘జనసేన’కు నాగబాబు కామెంట్స్ దెబ్బ?

రీసెంట్ గా బాలకృష్ణ తనకు ఎవరో తెలియదని నటుడు నాగబాబు ఎందుకు చెప్పారో తనకు తెలియదని చెప్పిన వివాదం ముదిరిన సంగతి తెలిసిందే. కమెడియన్ వల్లూరి బాలకృష్ణ ఫోటో చూపిస్తూ ఈయనే బాలయ్య అంటూ మరోసారి ఫ్యాన్స్ ని రెచ్చగొట్టాడు మెగా బ్ర‌ద‌ర్. రెండు రోజుల క్రితం మరోసారి బాలకృష్ణని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేశాడు నాగబాబు. ఇది చూసిన త‌ర్వాత‌ బాలయ్య ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

సోషల్ మీడియాలో నాగబాబు పోస్ట్ చేసిన ఒక క‌విత వైరల్ అవుతుంది. క‌ట్టు క‌థ‌లు కొన్ని.. క‌ల్ప‌న‌లు ఇంకొన్ని.. చుట్ట‌నేల మూట గ‌ట్ట‌నేల‌.. నిజం క‌క్క‌లేని బ‌యోపిక్కులొద్ద‌మ్మా విశ్వదాభిరామ‌.. విన‌రామామా అంటూ రాసుకొచ్చాడు నాగ‌బాబు. కింద క‌విత్వం మాకు కూడా వ‌చ్చ‌మ్మా అంటూ మ‌రో సెటైర్ వేసాడు నాగ‌బాబు. ఇప్పుడు ఇది క‌చ్చితంగా బాల‌య్య‌ని టార్గెట్ చేస్తూ పోస్ట్ చేసిందే అంటూ అర్థ‌మైపోతుంది.

ఇలా ఎన్టీఆర్ బయో పిక్ పై వేసిన సెటైర్ల క్లైమాక్స్ కు చేరుకుంది. దీనితో ఇప్పటి వరకు కేవలం సోషల్ మీడియాలో మాత్రమే కనిపించిన నందమూరి మెగా అభిమానుల వార్ ఇప్పుడు ఛానల్స్ ప్రసారం చేస్తున్న చర్చా కార్యక్రామాలలోకి కూడ చొచ్చుకుపోయి ఏకంగా ఈ విషయం పై ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారం చేసే స్థాయికి చేరిపోయింది.

ఈ పరిస్థితులలో నాగబాబు సెటైర్లను మొదట ఎంజాయ్ చేసిన పవన్ వీరాభిమానులు కూడ నాగబాబు అత్యుత్సాహం పై పెదవి విరుస్తున్నట్లు టాక్. ఏదో ఒకటి రెండు…మొదట్లో వినడానికి బాగుంటాయని అయితే అదేపనిగా పెట్టుకుని ఒక ప్రముఖ వ్యక్తిని టార్గెట్ చేస్తూ తరుచు కామెంట్స్ చేస్తూ ఉంటే ఆ కామెంట్స్ వల్ల ప్రయోజనం కన్నా నష్టం ఎక్కువగా ఉంటుందని పవన్ అభిమానులు భావిస్తున్నారు.