‘ధర్టీ ఇయిర్స్ ‘ పృధ్వీకి సీఎం జగన్ బంపర్ ఆఫర్..?!

‘ధర్టీ ఇయిర్స్ ‘ పృధ్వీకి సీఎం జగన్ బంపర్ ఆఫర్..?!

ఆంధ్రప్రదేశ్ లో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అలాగే ముఖ్యమంత్రిగా జగన్ తనదైన శైలిలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ పాలనను పరుగు పెంచారు. అంతేకాక తన ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేకూర్చాలని తన కేబినెట్‌లో కూడా అన్ని వర్గాల వారికి స్థానం కల్పిస్తూ వస్తున్నారు. తనను నమ్ముకుని పార్టీ కోసం పనిచేసిన వారికి నామినేటెడ్ పదవులు ఇస్తూ వస్తున్నారు.

అలాగే ఎన్నికలకు ముందు సినిమా సెలబ్రెటీలు మోహన్ బాబు, ఆలీ, పృధ్వీ, రాజశేఖర్ జీవితలు, పోసాని వంటి వారు వైసీపీలో చేరి పార్టీ విజయానికి తమవంతు కృషి చేసారు. అయితే వీరికి నామినేటెడ్ పోస్టులను ఇవ్వాలని జగన్ భావిస్తున్నాడట. అయితే ప్రముఖ కమెడియన్ నటుడు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పృథ్వీకి జగన్ కీలక పదవిని అప్పచెబుతున్నట్టు పార్టీలో ప్రచారం జరుగుతోంది.

రీసెంట్ గా ఇన్నాళ్లూ ఎస్వీబీసీ ఛైర్మన్‌గా ఉన్న రాఘవేంద్రరావు తన పదవికి రాజీనామా చేసారు. ప్రస్తుతం ఆ పదవి ఖాళీగా ఉండడంతో జగన్ ఎస్వీబీసీ చైర్మన్ గా పృథ్వీని నియమించాలని అనుకుంటున్నడట. అంతేకాదు దీనిపై పృధ్వీకి ఇప్పటికే సమాచారాన్ని కూడా అందించాడట సీఎం జగన్. అయితే త్వరలోనే అధికారికంగా పృధ్వీకి ఎస్వీబీసీ చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టేందుకు ఉత్తర్వులు కూడా అందుతాయని చెప్పుకుంటున్నారు. అందులో నిజమెంత ఉందనేది త్వరలో తెలిసిపోతుంది.