అనుష్కకు కనపడదు..వినపడదు?

బాహుబలి చిత్రం తర్వాత చాలా ఆఫర్స్ వచ్చినా అనుష్క కేవలం భాగమతి చిత్రంలోనే చేసింది. ఇప్పుడు మరోచిత్రం కమిటైంది. కథ నచ్చందే ఆమె సినిమా ఒప్పుకోవటం లేదు. పెద్ద హీరోల సినిమాల్లో అయితే ఎలాగో గ్లామర్ రోల్స్ చేస్తాం..ఇప్పుడు హీరోయిన్ ఓరియెంటెడ్ కథలు చేద్దాం అని ఫిక్స్ అయ్యింది. అందుకు తగ్గట్లుగా ఛాలెంజింగ్ రోల్స్ చేయ‌డానికి సిద్ధ‌ప‌డుతోంది.

దాదాపు ప‌దేళ్ళ క్రితం విడుద‌లైన `అరుంధ‌తి`తో స్టార్ డ‌మ్ పొందిన అనుష్క `సైలెన్స్‌` పేరుతో తెలుగు, త‌మిళ భాష‌ల్లో రూపొందుతున్న సినిమాలో ఓ విభిన్న‌మైన పాత్ర‌ను పోషించేందుకు సిద్ధ‌మ‌వుతోంద‌ని సమాచారం‌. ఇందుకోసం ఇప్పటికే అనుష్క…విజువల్లీ ఛాలెంజెడ్ పీపుల్ ని కలవటం, వారిని అబ్జర్వ్ చేయటం చేస్తోందిట.

`వ‌స్తాడు నా రాజు` ఫేమ్ హేమంత్ మ‌ధుక‌ర్ తెర‌కెక్కించ‌నున్న ఈ సైలెంట్ థ్రిల్ల‌ర్‌లో అనుష్క అంధురాలిగా క‌నిపించ‌నుంద‌ని తెలుస్తోంది. అంతేకాదు ఈ పాత్ర‌కి చెవుడు కూడా ఉంటుంద‌ని తెలుస్తోంది. అయితే ఈ విషయమై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.

మాధ‌వ‌న్ ఓ కీల‌క పాత్ర పోషిస్తున్న ఈ సినిమాకి ప్ర‌ముఖ తెలుగు సినీ ర‌చ‌యిత కోన వెంక‌ట్ స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. జ‌న‌వ‌రి నుంచి సెట్స్ పైకి వెళ్ళ‌నున్న ఈ సినిమాతో అనుష్క న‌టిగా మ‌రింత గుర్తింపు తెచ్చుకుంటుందని అభిమానులు వెయిట్ చేస్తున్నారు.