‘అంత‌రిక్షం’:రిలీజ్ కాకండానే ఆ ఆలోచన,కరెక్టేనా?

వ‌రుణ్ తేజ్ హీరోగా న‌టిస్తోన్న చిత్రం ‘అంత‌రిక్షం 9000 కెఎమ్‌పిహెచ్’. వ‌రుణ్ తేజ్, అదితి రావ్ హైద‌రీ, లావ‌ణ్య త్రిపాఠి ప్రధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్రాన్ని … ఘాజీతో జాతీయ అవార్డ్ అందుకున్న సంక‌ల్ప్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తెర‌కెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఈ చిత్రం ట్రైలర్,పాటలు అన్నీ కూడా సినిమా పై క్రేజ్ పెంచాయి. బిజినెస్ కూడా బాగా జరిగిందని వార్తలు వచ్చాయి. ఈ నేపధ్యంలో ఈ చిత్రానికి సంభందించిన మరో ప్లాన్ సిని జనాలను ఆశ్చర్యపరుస్తోంది. సినిమా రిలీజ్ అవ్వకుండానే సంకల్ప్ రెడ్డి ఈ సినిమా సీక్వెల్ ప్లాన్ చేసారట.

ఇదే బ్యానర్ పై ఈ సీక్వెల్ ని సైతం నిర్మించటానికి క్రిష్ ఆసక్తి చూపారట. సీక్వెల్ కు సంభందించిన స్క్రిప్టు సైతం రెడీ అయ్యిందని తెలుస్తోంది. ఎలాగూ ఈ సినిమా కోసం వేసిన సెట్ ఉంది కాబట్టి కొంత ఖర్చు కలిసి వస్తుంది..హిట్ టాక్ వస్తే అదే నటీనటులతో ఇమ్మీడియట్ గా సినిమా ప్రారంభిస్తే క్రేజ్ వస్తుందని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ విషయమై అధికారిక సమాచారం ఏమీ లేదు.

చిత్రం విషయానికి స్తే.. జీరో గ్రావిటీలో ప్ర‌త్యేకంగా డిజైన్ చేసిన స్పేస్ సెట‌ప్‌లో ఈ అంత‌రిక్షం సినిమాను చిత్రీక‌రించారు ద‌ర్శ‌కుడు సంక‌ల్ప్ రెడ్డి. ఈ చిత్రం కోసం అత్యున్న‌త సాంకేతిక విభాగం ప‌ని చేశారు. హాలీవుడ్ యాక్ష‌న్ నిపుణుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో అంత‌రిక్షం చిత్రానికి అద్భుత‌మైన యాక్ష‌న్ ఎపిసోడ్స్ చిత్రీక‌రించారు. విజువ‌ల్ ఎఫెక్ట్స్ ఈ చిత్రానికి ప్ర‌ధానాక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌నున్నాయి.

హీరో వ‌రుణ్ తేజ్ తో పాటు ప‌లువురు న‌టీన‌టులు కూడా ఈ చిత్రంలోని యాక్ష‌న్ సీక్వెన్సుల కోసం ప్ర‌త్యేకంగా శిక్ష‌ణ తీసుకున్నారు. ‘అంత‌రిక్షం 9000 కెఎమ్‌పిహెచ్’ కోసం.. ఎలాంటి రిస్క్ అయినా తీసుకోవడానికి చిత్ర యూనిట్ సిద్ధపడినట్లుగా సమాచారం. ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో ద‌ర్శ‌కుడు క్రిష్ జాగ‌ర్ల‌మూడి, సాయిబాబు జాగ‌ర్ల‌మూడి, వై రాజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

జ్ఞాన‌శేఖ‌ర్ ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ప్ర‌శాంత్ విహారి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్ర‌యోగాత్మ‌కంగా తెర‌కెక్కుతోన్న చిత్రం కావ‌డంతో ఈ చిత్రంపై భారీ అంచ‌నాలున్నాయి. డిసెంబ‌ర్ 21న ఈ చిత్రం విడుద‌ల కానుంది.