‘రంగమ్మత్త’గా రెండేళ్ల క్రితం ఓ మెగా ప్రాజెక్టులో కనిపించి ఆడియన్స్ మెదళ్లలో ఫిక్సైపోయింది యాంకర్ కమ్ ఆర్టిస్టు అనసూయ. మళ్లీ అనసూయకు మరో మెగా ప్రాజెక్టులో చాన్స్ దక్కనుందట. రెండేళ్ల కిందట రామ్చరణ్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ‘రంగస్థలం’ చిత్రంలో అనసూయ ప్రాధాన్యత కలిగిన పాత్ర పోషించి మెప్పించటం తెలిసిందే. అట్రాక్షన్, ఎమోషన్ కలగలిపి చూపించి ‘రంగమ్మత్త’ ఇమేజ్ను ఇంకా క్యారీ చేస్తోంది. తాజాగా పవన్ కల్యాణ్తో దర్శకుడు క్రిష్ తెరకెక్కించనున్న మొఘల్ పీరియడ్ మూవీలో ఎక్కువ నిడివివున్న ప్రాధాన్యత కలిగిన పాత్ర దక్కనుందట. ఆ పాత్రకు అనసూయ ఆప్ట్ అని దర్శకుడు ఫిక్సవ్వడంతో చాన్స్ దొరికినట్టేనన్న టాక్ వినిపిస్తోంది. అదే నిజమైతే ‘రంగమ్మత్త’ ఇమేజ్ గ్రాఫ్ మరింత పెరగటం ఖాయం. పవన్ కల్యాణ్ 27వ ప్రాజెక్టును భారీ చిత్రాల నిర్మాత ఏఎం రత్నం నిర్మించనున్నారు.