అడివి శేష్ హీరోయిన్ …. పెళ్లి కాలేదుకానీ ప్రెగ్నెంట్ అయ్యింది!

తెలుగ‌మ్మాయి శోభితా దూలిపాళ్ల `గూఢ‌చారి` సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైంది. ఇన్వేస్టిగేటివ్ రా థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ చిత్రం బ‌డ్జెట్ ప‌రంగా, లాభాల ప‌రంగా, మేకింగ్ ప‌రంగా బిగ్ స్టార్స్‌నే ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అడివి శేష్ హీరోగా న‌టించిన ఈ చిత్రం ద్వారా శ‌శికిర‌ణ్ తిక్క ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌య్యారు. చిన్న చిత్రాల్లో పెద్ద విజ‌యాన్ని సాధించిన ఈ చిత్రం ప‌రిశ్ర‌మ వ‌ర్గాల‌తో పాటు ప్రేక్ష‌కుల దృష్టిని ఆక‌ర్షించింది.

అయితే ఈ సినిమా ద్వారా ప‌రిచ‌య‌మైన శోభితా దూలిపాళ్ల‌కు తెలుగులో మ‌రో చిత్రాన్ని మాత్రం అందించ‌లేక‌పోయింది. దీంతో బాలీవుడ్‌కు వెళ్లిపోయిన శోభిత అక్క‌డ వ‌రుస చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా మారిపోయింది. తాజాగా సోష‌ల్ మీడియా ఇన్‌స్టాలో ఆమె పోస్ట్ చేసిన ఫొటో వైర‌ల్‌గా మారింది. పెళ్లికాని శోభిత ఆ ఫొటోలో బేబీ బంప్‌తో క‌నిపించ‌డం ప‌లువురిని షాక్‌కు గురిచేస్తోంది. పెళ్లి కాకుండానే శోభిత గ‌ర్భం ఎలా ధ‌రించింద‌ని నెటిజ‌న్స్ అంతా ఆరాతీస్తున్నారు. అయితే శోభిత మాత్రం ప్నందించ‌డం లేదు. అయితే ఈ ఫొటో వెన‌క `ఘోస్ట్ స్టోరీస్‌` మెలిక వుందని తేలింది.

నెట్‌ఫ్లిక్స్ నిర్మిస్తున్న`ఘోస్ట్ స్టోరీస్‌` వెబ్ సిరీస్‌లో శోభిత న‌టిస్తోంది. ఈ వెబ్ సిరీస్ మొత్తం నాలుగు భాగాలుగా రాబోతోంది. ఇందులో ఒక‌ భాగాన్ని క‌ర‌ణ్‌జోహ‌ర్,  దిబాక‌ర్ బెన‌ర్జీ రెండ‌వ భాగాన్ని, జోయాఅక్త‌ర్ మూడ‌వ భాగాన్ని,  అనురాగ్ క‌శ్య‌ప్ నాలుగ‌వ భాగాన్ని రూపొందిస్తున్నారు. అనురాగ్ క‌శ్య‌ప్ రూపొందిస్తున్న నాలుగ‌వ భాగంలో శోభిత పిల్ల‌ల కోసం త‌పించే యువ‌తిగా క‌నిపించ‌బోతోంది. అందులోని ఫొటోనే శోభిత ఇన్‌స్టాలో తెలివిగా పోస్ట్ చేసిన‌ట్టు చెబుతున్నారు. జ‌న‌వ‌రి 1 నుంచి `ఘోస్ట్ స్టోరీస్‌` స్ట్రీమింగ్ ప్రారంభ‌మైంది.