
ఎర్రన్నాయుడు కుటుంబానిదే పెత్తనం?
దివంగత నేత ఎర్రన్నాయుడి కుటుంబం నుంచి ముగ్గురు వ్యక్తులు ప్రస్తుతం టీడీపీ నుంచి ప్రజా ప్రతినిథులుగా వున్నారు. ఎర్రన్నాయుడు సోదరుడు అచ్చెన్నాయుడు (ఎమ్మెల్యే), ఎర్రన్నాయుడి కుమారుడు రామ్మోహన్నాయుడు (ఎంపీ), ఎర్రన్నాయుడి కుమార్తె భవానీ (ఎమ్మెల్యే) టీడీపీకి సంబంధించి ప్రస్తుతం కీలక నేతలుగా వ్యవహరించాల్సిన పరిస్థితి. ఇందులో ఇద్దరికి చంద్రబాబు కీలక పదవులు కట్టబెట్టారు. అచ్చెన్నాయుడు టీడీపీ ఏపీ అధ్యక్షుడైతే, రామ్మోహన్నాయుడిని జాతీయ కార్యవర్గంలోకి తీసుకుని.. ఏకంగా జాతీయ ప్రధాన కార్యదర్శిని చేశారు చంద్రబాబు. రేపో మాపో ఎమ్మెల్యే భవానీకి కూడా పార్టీలో కీలకమైన పదవి దక్కొచ్చు. ఇవన్నీ డ్యామేజ్ కంట్రోల్ చర్యలు తప్ప, పార్టీని బలోపేతం చేసే చర్యలు కావన్న అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతోంది. పార్టీ మారాల్సిందిగా అచ్చెన్నాయుడిపై అధికార వైసీపీ నుంచి చాలా ఒత్తిడి వుంది. రామ్మోహన్నాయుడికి ఇటు వైసీపీతోపాటు అటు బీజేపీ కూడా గాలమేస్తోంది. ఈ నేపథ్యంలో ‘పట్టు జారిపోకుండా’ చంద్రబాబు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. నందమూరి బాలకృష్ణకి పార్టీ పొలిట్ బ్యూరోలో అవకాశం దక్కడం ఇంకో కీలకమైన పరిణామం. గల్లా అరుణకుమారి, ప్రతిభా భారతి.. తదితర సీనియర్ నేతలు, పార్టీని వీడతారనే ప్రచారం జరుగుతుండగా, వారికి కూడా కీలకమైన పదవులు పార్టీ పరంగా కట్టబెట్టారు చంద్రబాబు.
చేతులు కాలాక..
