Supreme Court: రిజర్వేషన్ వ్యవస్థపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు

భారతదేశంలో కుల ఆధారిత రిజర్వేషన్ల విధానంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఓబీసీ రిజర్వేషన్ల అంశంపై మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల కేసులో విచారణ జరుగుతున్న సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్నాయి. రిజర్వేషన్ల వ్యవస్థను రైలు బోగీలకు పోల్చిన జస్టిస్ సూర్యకాంత్, ఒక వర్గం ప్రయాణికులు బోగీలోకి ప్రవేశించిన తర్వాత ఇతర వర్గాల వారిని ఆహ్వానించడానికి ఆసక్తి చూపడం లేదని వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఒకసారి రిజర్వేషన్ బెనిఫిట్ పొందిన తరగతులు తమ వర్గం నుంచే ఎక్కువ మంది ప్రయోజనం పొందాలని భావిస్తున్నాయి. ఇది బహుళ సామాజిక విభజనకు దారి తీస్తోంది” అని పేర్కొన్నారు. జస్టిస్ సూర్యకాంత్ ఈ ఏడాది డిసెంబర్‌లో ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో, ఈ వ్యాఖ్యలకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది.

మహారాష్ట్రలో చివరిసారిగా 2016-17లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం ఓబీసీ రిజర్వేషన్ల అంశం రాజకీయంగా, న్యాయపరంగా కొంత కాలంగా నిలిచిపోయింది. 2021లో 27% ఓబీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ‘త్రివిధ సూత్రం’ ప్రకారం.. గణాంకాలు, కమిషన్ నివేదిక, 50% పరిమితి పాటించాల్సిన నిబంధనలతో ప్రభుత్వం ఇప్పటికీ తేలియాడుతోంది.

న్యాయవాది ఇందిరా జైసింగ్ కోర్టులో వాదిస్తూ, ఓబీసీ జనగణన డేటా సేకరణ జరిగిందని, కానీ దానిని ఎన్నికల కోసం ఉపయోగించడం లేదని మండిపడ్డారు. ఆమె రాష్ట్రాన్ని మేనేజ్మెంట్ కమిటీలు ద్వారానే స్థానిక పరిపాలన కొనసాగించడంపై విమర్శలు చేశారు. ఓబీసీలకు న్యాయం చేయాలంటే తక్షణమే ఎన్నికలు జరపాలని, రిజర్వేషన్ల విషయంలో స్పష్టత ఇవ్వాలని కోర్టును కోరారు.

పవన్ పై ప్రకాష్ రాజ్ || Social Activist Krishna Kumari EXPOSED Prakash Raj Vs Pawan Kalyan || TR