Sunita Williams: సునీతా విలియమ్స్ భూమిపైకి వచ్చాక… శరీరంపై ప్రభావం ఎలా ఉంటుందంటే..

నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుల్ విల్మోర్ ఎట్టకేలకు భూమి మీదకు తిరిగి వచ్చే సమయం దగ్గర పడింది. అనుకున్న కంటే ఎక్కువ సమయం అంతరిక్షంలో గడిపిన వీరు, మార్చి 19న స్పేస్ ఎక్స్ డ్రాగన్ వ్యోమనౌక ద్వారా భూమి వైపు ప్రయాణం చేయనున్నారు. దాదాపు 8 నెలలుగా జీరో గ్రావిటీ పరిసరాల్లో ఉన్న వీరికి భూమికి చేరిన తర్వాత అనేక మార్పులు ఎదురయ్యే అవకాశముంది.

అంత కాలం శూన్యాకర్షణలో గడిపిన తర్వాత భూమి మీద సాధారణ పనులు కూడా గంభీరంగా అనిపిస్తాయని విల్మోర్ వెల్లడించారు. చిన్న వస్తువును లేపినా, భారీ బరువును ఎత్తినట్లుగా అనిపించవచ్చని చెప్పారు. శరీరం తిరిగి భూమి ఆకర్షణశక్తికి అలవాటు పడే వరకు కొన్ని రోజులు అసౌకర్యం తప్పదని తెలిపారు. స్పేస్ నుంచి తిరిగి వచ్చిన 24 గంటల్లోనే వ్యోమగాములు మానసికంగా, శారీరకంగా మార్పులను అనుభవిస్తారని నాసా తెలిపింది.

అంతరిక్షంలో ఎక్కువ కాలం గడిపిన వ్యోమగాములకు ఆరోగ్యపరమైన ప్రభావాలు తప్పవు. శరీరం మైక్రో గ్రావిటీ పరిస్థితులకు తగ్గట్టుగా మారడం వల్ల ఎర్ర రక్తకణాల సంఖ్య తగ్గుతుంది. దీని కారణంగా ఆక్సిజన్ సరఫరా తగ్గి, నిస్సత్తువ, అలసట, పని సామర్థ్యం తగ్గడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. అంతేకాదు, ఎముకల సాంద్రత కూడా తగ్గిపోతుంది.

వైరుధ్యంగా ఉన్న పరిస్థితులకు శరీరం పూర్తిగా సరిపోయే వరకు వ్యోమగాములు పర్యవేక్షణలో ఉంటారు. గుండె పనితీరు కూడా మారే అవకాశం ఉండటంతో, వీరు మళ్లీ సాధారణ స్థితికి చేరుకునేందుకు కొంత సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. వ్యోమగాముల భవిష్యత్తు ప్రయాణాల కోసం, వీరి అనుభవాలు నాసా కొత్త పరిశోధనలకు దోహదపడతాయని చెబుతున్నారు.

జగన్ 2. 0 వేరేలా ఉంటదా.? || Jagan2.O Vyuham On Ap Politics || Ysrcp Vs TDP || Telugu Rajyam