ప్రభుత్వంపై కోర్టుకెళ్లిన రేణు దేశాయ్… మేటర్ సీరియస్!

తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అవసరం లేని పేర్లలో రేణు దేశాయ్ కూడా ఒకరు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన “బద్రీ” సినిమాలో పవన్ సరసన హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రేణు… చేసిన సినిమాలు తక్కువే అయినా… అనంతరం పవర్ స్టార్ పవన్ ని పెళ్లి చేసుకొని ఫేమస్ అయ్యారు. ఈ క్రమంలో తాజాగా ఆమె ప్రభుత్వంపై కోర్టుకు వెళ్లారు.

గతంలో పవన్ తో విడిపోయిన అనంతరం పెద్దగా లైం లైట్ లోకి రాని రేణు… సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ చురుకుగా ఉంటారు. తనకు నచ్చిన విషయాలను, అభిప్రాయాలను పంచుకుంటూ ఉంటారు. ఈ సమయంలో తెలంగాణ సర్కార్ తీసుకున్న ఒక నిర్ణయంపై ఆమె కోర్టును ఆశ్రయించారు. దీంతో విషయం హాట్ టాపిక్ గా మారింది.

ప్రస్తుతం హైదరాబాద్ లో ఆక్వా మెరైన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్న సంగతి తెలిసిందే. దానికి సంబంధించి ఇప్పటికే తగినట్లు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. దీనిని ప్రస్తుతం రేణు దేశాయ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

అవును… హైదరాబాద్ నగర శివారులోని కొత్వాల్‌ గూడలో ఆక్వా మెరైన్ పార్క్, పక్షిశాల ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆక్వా మెరైన్ పార్క్ కోసం కృత్రిమ సరస్సును సృష్టించడం పర్యావరణానికి ప్రమాదం అని రేణు దేశాయ్ చెబుతున్నారు. దీంతో… వెంటనే పార్క్ ఏర్పాటు చర్యలను నిలిపివేయాలని ఆమె కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ విషయంపై రేణు దేశాయ్ తో పాటు, నటి శ్రీదివ్య, డైరెక్టర్ శశికిరణ్ తిక్కా, హీరోయిన్ సదా తో పాటు పలువురు సెలబ్రెటీలు కూడా ఈ పార్క్ పై అభ్యంతరాలు వ్యక్తం చేయడం గమనార్హం. వీరందరూ కలిసే జూన్ 27న కోర్టులో పిటిషన్ వేశారు. వీరు వేసిన పిటిన్ ని న్యాయస్థానం అంగీకరించింది.

వీరి పిటిషన్ ని పరిశీలించిన న్యాయస్థానం చీఫ్ జస్టిస్ ఉజ్వల్ భూయాన్, జస్టిస్ ఎన్. తుకారామ్ జి… ఇలాంటి పార్కుల నిర్మాణం సింగపూర్, మలేషియా వంటి దేశాలలో జరిగింది. మన దేశంలో ఎందుకు జరగకూడదు అని ప్రశ్నించడం గమనార్హం. మరి ఈ పిటిషన్ విషయంలో న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇస్తుందో వేచి చూడాలి.