భారతీయ సంప్రదాయ వైద్య విధానాల అభివృద్ధికి ఉద్దేశించిన ఆయుష్ మంత్రిత్వ శాఖ కరోనా కాలంలో డైనమిక్ గా వ్యవహరించకపోవడం విమర్శలకు దారితీసింది. అలోపతిలో కరోనా రుగ్మతకు నిర్దిష్టంగా మందులు లేవని తెలిసిపోయింది. వ్యాక్సిన్ వస్తే తప్ప కరోనాను నిలువరించే పరిస్ధితి లేకుండా పోయింది. కరోనా రాకుండా ఉండాలంటే రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం తప్ప గత్యంతరం లేదని అందరూ చెబుతున్నారు. రోగ నిరోధక శక్తి పెంచే ఔషధాలు ఆయుర్వేదంలో ఎక్కువగా ఉండడంతో ప్రజలు ఈ వైద్య విధానాన్ని తెలిసో తెలియకో అనుసరిస్తున్నారు. వంటింట్లో అందుబాటులో ఉండే అల్లం, పసుపు, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర, వాము వంటి వాటితో కషాయాలు కాసుకొని తాగుతున్నారు.
జగన్ సర్కార్ లెక్క కూడా గాడి తప్పుతోందా?
ఈ సంప్రదాయ వైద్య విధానాలపై ప్రజలకు ఉద్యమ స్థాయిలో చైతన్యం కలిగించాల్సిన ఆయుష్ మంత్రిత్వ శాఖ ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తోంది. కరోనా వంటి మాయదారి మహమ్మారి వైరస్ వ్యాపిస్తున్నట్టు తొలి సూచనలు రాగానే జనవరిలోనే ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రోయాక్టివ్ గా వ్యవహరించి ఉండాల్సింది. కరోనా వైరస్ దేశంలో దాదాపు అన్ని ప్రాతాలకు విస్తరించిన తర్వాత ఆయుష్ ఇచ్చిన ఒకే ఒక ప్రకటన దీనికి హోమియోలో మందు ఉందని, ఆర్సెనిక్ ఆల్బ్ అనే హోమియో మందును రోగ నిరోధకంగా వాడుకోవచ్చని. గతంలో చికెన్ గున్యా, బర్ద్ ఫ్లూ, స్వయిన్ ఫ్లూ వంటి వైరస్ రుగ్మతలపై పనిచేసినట్టు దాఖలాలు ఉన్నాయి. అటువంటప్పుడు ఈ కరోనా వైరస్ మీద కూడా హోమియో పనిచేస్తుందన్న నమ్మకంతో ఎందుకెళ్లాల్సిన ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రజల్లో విశ్వాసం కలిగించలేకపోయింది. అలోపతి వైద్య పీఠాధిపతులకు హోమియో అంటే పడదు. ఆయుర్వేదం అంటే అలెర్జీ. అవి అశాస్త్రీయమైనవని వారి అభిప్రాయం.
సోషల్ డిస్టెన్స్ అంటే గిదేనా కేసీఆర్ సాబ్..!
అశాస్త్రీయమని వీరు చెబుతున్న ఆయుర్వేద, యోగా, నేచురోపతి, యునాని, సిద్ధ, హోమియో పతి వైద్య విధానాలను కలిపి 2014 లో కేంద్ర ప్రభుత్వం ఆయుష్ అనే మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. ప్రస్తుత బడ్జెట్ లో ఆయుష్ కు దాదాపు రెండువేల కోట్ల రూపాయలు కేటాయించారు. అలోపతి వైద్య పీఠాధిపతుల అభ్యంతరాలతో సంబంధం లేకుండా ధైర్యంగా ఈ మంత్రిత్వ శాఖను ప్రారంభించి తగినన్ని నిధులు కూడా ఇస్తున్న కేంద్రం ఈ శాఖ నుంచి కరోనా కాలంలో కూడా సమర్ధమైన సేవలను రాబట్టలేకపోవడం దురదృష్టకరం. ఇరవై రూపాయల ఖరీదు గల ఆర్సనిక్ ఆల్బ్ – 30 అనే చిన్న బాటిల్ తో కనీసం ఇరవై మందికి కరోనా రాకుండా ప్రివెంటివ్ డోస్ గా వేయవచ్చని హోమియో నిపుణులు చాలా మంది చెప్పారు. దీని మీద ప్రాధమిక పరిశోధనను చేసి, యుద్ధప్రాతిపదికన రంగంలోకి దిగవలసిన ఆయుష్ మంత్రిత్వ శాఖ “ఆర్సనిక్ ఆల్బ్ ‘ వాడుకోవచ్చని చిన్న ప్రకటన విడుదల చేసి చేతులు దులుపుకుంది. ఈ మందును ఏదైనా చిన్న జనావాసంపైన ఉపయోగించి, ఫలితాలను చూసి, నిర్ధారించుకున్న తర్వాత దేశమంతా పంచి ఉండాల్సింది. కరోనా ఇన్ని నెలలుగా కరాళ నృత్యం చేస్తున్నా ఒక ఇరవై రోజులు పట్ట్టే ఈ ప్రయోగాన్ని ఆయుష్ మంత్రిత్వ శాఖ ఎందుకు చేయలేకపోయింది? కోల్కతా లోని హోమియో పరిశోధన కేంద్రానికి యాభై కోట్ల రూపాయల నిధులు ఇచ్చిన ఈ శాఖ ఏ ఫలితాలను రాబట్టింది?
ఆలోపతిలో సరైన మందులు లేనందు వల్ల తమ సంప్రదాయ వైద్యంతోనే కరోనాను కట్టడి చేసుకున్నామని చైనా అనేక సందర్భాలలో తెలియజేసింది. సంప్రదాయ వైద్య విధానాలతో కరోనా నుంచి త్వరగా కోలుకున్నామని ప్రిన్స్ చార్లెస్ సహా అనేక మంది ప్రముఖులు తెలియజేశారు. కరోనా విలయం ఇంకా చాలా కాలం ఉండేటట్టు కన్పిస్తోంది. ఆయుష్ మంత్రిత్వ శాఖ ఇప్పటికైనా జాగృతమై హోమియో, ఆయుర్వేద వైద్యంలో ఉన్న ‘సంజీవని’ లను ప్రజలకు అందుబాటులోకి తేవలసిన అవసరముంది.
— శాంతా రామ్
