Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’.. భారత సైన్యం పర్ఫెక్ట్ క్లారిటీ!

పహల్గాంలోని పర్యాటకులపై ఏప్రిల్ 22న జరిగిన ఉగ్ర దాడికి ప్రతిగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ అంతర్గతంగా, అంతర్జాతీయంగా పెద్ద చర్చకు దారి తీసింది. ఈ దాడికి ముందు భారత నిఘా వర్గాలు సేకరించిన వివరాలు, ఉగ్రవాదుల కదలికలపై నిశిత పరిశీలన తర్వాతనే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. బుధవారం తెల్లవారుజామున పాక్ భూభాగం, పీవోకే ప్రాంతాల్లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని వైమానిక దళాలు సర్జికల్ దాడులు నిర్వహించాయి.

రక్షణ శాఖ మీడియా సమావేశంలో, ఈ దాడులకు సంబంధించి వివరాలను అధికారికంగా వెల్లడించారు. ముఖ్యంగా ఈసారి ఒక ప్రత్యేకత ఏమిటంటే, ఉగ్రదాడిలో మహిళలను లక్ష్యంగా చేసిన ఘటనకు ప్రతిగా, దాడుల వివరాలను వెల్లడించడానికి మిలిటరీలో పనిచేస్తున్న మహిళా అధికారులను ముందుకు తీసుకువచ్చారు. కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ లు మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఈ దాడులు కేవలం ఉగ్రవాద శిబిరాలపై మాత్రమే జరిగాయని, పాక్ సైన్యం లేదా పౌరులకు హాని కలిగించలేదని స్పష్టం చేశారు.

వీరి ప్రకారం, ముంబై దాడులకు పాల్పడ్డ ఉగ్రవాదులు శిక్షణ పొందిన స్థావరాలు, పహల్గాం దాడికి ప్రణాళిక చేసిన టీఆర్ఎఫ్ మద్దతుదారుల కేంద్రాలు ప్రధాన లక్ష్యాలుగా మారాయి. త్రివిధ దళాల సమన్వయంతో దాడులు అత్యంత ఖచ్చితంగా జరిగాయని, ఉగ్ర శిబిరాల నిర్వీర్యం భారత్ సాధించిందని వారు తెలిపారు. ఎంతమంది ఉగ్రవాదులు హతమయ్యారన్నది ఇంకా వెల్లడించనప్పటికీ, నష్టం భారీగానే ఉందని గుర్తించారు.

ఈ ఆపరేషన్‌కు ‘సిందూర్’ అని పేరు పెట్టడం వెనుక ప్రత్యేక ఉద్దేశం ఉంది. పహల్గాంలో మహిళలను కుంకుమ తీయించి హత్య చేసిన ఉగ్రవాదుల చర్యలకు తగిన జవాబు చెప్పేలా, వారికి న్యాయం జరిగిందన్న సంకేతంగా ఈ ఆపరేషన్‌కి ఈ పేరు పెట్టారని విశ్లేషకులు భావిస్తున్నారు. భారత్ దాటిగా ప్రతిచర్య చూపించడమే కాక, ప్రపంచానికి స్పష్టమైన సంకేతం ఇచ్చిందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

శాల్తీలు లేచిపోతాయ్ | Major PT Chowdary About India Pakistan War | Operation Sindoor | Modi | TR