Pahalgam Terror Attack: పహల్గామ్ దాడికి ప్రతీకారం… పాక్ మిలిటరీ దౌత్యవేత్తలకు భారత్ నోటీసులు!

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం పాకిస్థాన్‌పై దౌత్యపరమైన చర్యలను వేగవంతం చేసింది. ఇప్పటికే పాకిస్థాన్ పౌరుల భారత్‌లో ప్రవేశంపై ఆంక్షలు విధించిన కేంద్రం, తాజాగా ఢిల్లీలోని పాక్ మిలిటరీ దౌత్యవేత్తలపై కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ చర్యలు పహల్గామ్ మారణహోమానికి తీవ్ర స్పందనగా భావించవచ్చు.

బుధవారం అర్ధరాత్రి అనంతరం, ఢిల్లీలో ఉన్న పాకిస్థాన్ రాయబార కార్యాలయంలో మిలిటరీ దౌత్యవేత్త సాద్ అహ్మద్ వరైచ్‌ను భారత విదేశాంగ శాఖ అధికారులు ప్రత్యేకంగా పిలిపించారు. ఈ సమావేశంలో ఆయనకు ‘పర్సోనా నాన్ గ్రాటా’ నోటీసులు అందజేశారు. అంటే, ఆయన్ను ‘అయిష్ట వ్యక్తిగా’ ప్రకటించినట్టు ఈ నోటీసు అర్థం. దీనివల్ల ఆయనతో పాటు సంబంధిత మిలిటరీ దౌత్యవేత్తలు వారం రోజుల్లోగా భారత్‌ను విడిచిపెట్టాల్సి ఉంటుంది.

ఇటీవలి కాలంలో భారత్, పాకిస్థాన్ మధ్య సంబంధాలు మరింత దిగజారిన నేపథ్యంలో ఈ నిర్ణయం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. పహల్గామ్ ఉగ్రదాడికి లష్కరే తోయిబా ముళ్ల వెనుక ఉన్నట్లు తేలడంతో, పాక్ మిలిటరీ సంబంధిత వ్యక్తులపై అనుమానాలు బలంగా వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఈ నోటీసులు జారీ చేశారని సమాచారం.

కాగా, దీనికి ముందుగా భారత్ కేంద్ర ప్రభుత్వం పాక్‌తో ఉన్న సింధూ నది జలాల ఒప్పందాన్ని రద్దు చేసి, దేశంలోకి పాక్ పౌరుల ప్రవేశంపై కఠిన ఆంక్షలు విధించింది. పహల్గామ్ దాడిలో అమాయక పర్యాటకుల ప్రాణాలు పోయిన నేపథ్యంలో, ఈ దౌత్యచర్యలు భారత్ కఠిన వైఖరిని చాటుతున్నాయి. ఉగ్రవాదానికి పాల్పడుతున్న దేశాలకు భారత ప్రభుత్వం ఇక సహనంగా ఉండబోదని స్పష్టం చేస్తున్నట్లయింది.

ఎక్కడున్నావ్ పవన్ || Analyst Ks Prasad EXPOSED Pawan Kalyan Over Pitapuram Dalit Issue || TR