India Military: దేశాల రక్షణ ఖర్చుల్లో భారీ పెరుగుదల.. భారత్ ఏ స్థానంలో?

అగ్రదేశాల భయంకరంగా పెరుగుతున్న రక్షణ వ్యయం ఇప్పుడు ప్రపంచ శాంతికి సవాల్‌గా మారింది. ఇటీవల సిప్రి విడుదల చేసిన గ్లోబల్ డిఫెన్స్ స్పెండింగ్ నివేదిక ప్రకారం, 2024లో ప్రపంచ దేశాలు కలిపి ₹203 లక్షల కోట్లు (2.44 ట్రిలియన్ డాలర్లు) ఖర్చు చేసినట్టు వెల్లడైంది. ఇది గత పదకొండేళ్లలోనే అత్యధికం. ఈ గణాంకం చూసి రాజకీయ విశ్లేషకులు, శాంతి సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

సైనిక వ్యయాల జాబితాలో అమెరికా మళ్లీ అగ్రస్థానంలో నిలవగా, చైనా, రష్యా తదుపరి స్థానాల్లో ఉన్నాయి. అమెరికా ఏకంగా రూ. 83 లక్షల కోట్లతో (997 బిలియన్ డాలర్లు) దూసుకెళ్లింది. చైనా రూ. 26 లక్షల కోట్లు (314 బిలియన్) ఖర్చు చేసింది. ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న రష్యా ₹12 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేసి మూడో స్థానాన్ని దక్కించుకుంది.

భారత్ కూడా ఈసారి శక్తివంతమైన దేశాల సరసన నిలిచింది. ఈ ఏడాది 86.1 బిలియన్ డాలర్లతో (సుమారు రూ. 7 లక్షల కోట్లు) ఐదో స్థానంలో నిలిచింది. గత పది ఏళ్లలో భారత్ రక్షణ వ్యయం 42% పెరగడం గమనార్హం. అయితే, కేంద్ర ప్రభుత్వం ఇందులో 75% బడ్జెట్‌ను ‘మేడ్ ఇన్ ఇండియా’ ఆయుధాలకే కేటాయించడమే విశేషం.

ఇక ఐరోపా దేశాల్లోనూ పరిస్థితి తీవ్రంగా మారుతోంది. జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ వ్యయాలు భారీగా పెరిగాయి. ఉక్రెయిన్ మాత్రం సంచలనంగా ఏకంగా తన జీడీపీలో 34% మొత్తాన్ని సైనిక రంగానికి ఖర్చు చేసింది. తూర్పు ఆసియాలో జపాన్ 21% పెంపుతో అత్యధిక వృద్ధి నమోదుచేసింది. ఇక పాకిస్థాన్ ను చూసుకుంటే ఈ లిస్టులో 10వ స్థానంలో ఉంది. ఈ పెరుగుదల వెనుక ప్రపంచంలోని తీవ్రమవుతున్న ఉద్రిక్తతలు, యుద్ధ భయం, భద్రతపై పెరుగుతున్న అవగాహన వున్నాయని సిప్రి విశ్లేషించింది.

నోరుజారిన పవన్ || Journalist Bharadwaj Reacts On Pawan Kalyan Comments On Congress Leaders || TR