పేకాట క్లబ్బు అంశంతో మళ్లీ ఇబ్బంది పడుతున్న ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి

గుంటారు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి కొత్త సమస్యలు వస్తున్నాయని సమాచారం. అనుచరగణమే ఇపుడు ఆమెను బుక్ చేసేందుకు సిద్ధం అవుతున్నారని టాక్. సోషల్ మీడియా వేదికగా ఆమెను లక్ష్యంగా చేసుకొని దాడి చేస్తున్నారు. ప్రతిపక్షాల ఆరోపణలతో సద్ధుమణిగిందనుకుంటున్న రెయిన్‌ ట్రీ పార్క్‌ లో పేకాట క్లబ్బు వివాదాన్ని ఇప్పుడు మాజీ అనుచరులే వెలికి తీస్తున్నారని సమాచారం.

ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి … తన అనుచరులతో జిల్లాలో పేకాట క్లబ్బులు నడిపించి బాగా పోగేసుకున్నారని ఆరోపణలున్నాయి. అయితే ప్రతిపక్షాలు ఈ విషయాన్ని రచ్చ రచ్చ చేయడంతో పాటు పేకాట క్లబ్ నిర్వాహకులపై పోలీసులు కేసులు పెట్టడంతో ఈ వ్యవహారం అప్పట్లో రచ్చ రచ్చ అయింది. అయితీ ఈ పేకాట క్లబ్ కు తనకు ఎలాంటి సంబంధం లేదని ఉండవల్లి శ్రీదేవి ప్రకటించారు. కొంత మంది కావాలని తనపై బురద జల్లుతున్నారని ఆరోపించారు. అయితే పోలీసులు ఎవరిపై అయితే కేసులు పెట్టారో వాళ్లు మాత్రం నేరుగా ఉండవల్లి శ్రీదేవిపై ఆరోపణలు చేయకున్నా… తన సన్నిహితుల వద్ద తప్పంతా ఆమె పై నెడుతున్నారంటా. ఆవిడ సహకారంతోనే పేకాట క్లబ్బులు నిర్వహించినట్లు వాళ్లు తమ సన్నిహితుల వద్ద చెప్పుకుంటున్నారని వినికిడి. అయితే ఈ అంశాన్ని వాళ్లు నేరుగా మీడియా ముందు వివరించలేదు. అయితే ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్న పార్టీ అధిష్టానం సదరు నాయకులను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.

పార్టీ నుంచి సస్పెండ్ అవడంతో ఏమి చేయాలో తోచక అప్పట్లో సైలెంట్ అయిపోయిన నాయకులు ఆతర్వాత తేరిగ్గా తేరుకొని ఇప్పుడు సదరు మహిళా ఎమ్మెల్యేను టార్గెట్ చేస్తున్నారని సమాచారం. ఇందు కోసం సోషల్ మీడియాను వాడుకుంటున్నారని తెలుస్తోంది. పేకాట క్లబ్బులకు సంబంధించి సదరు మహిళా ఎమ్మెల్యేతో నడిపిన ఫోన్ సంభాషణలను సదరు వ్యక్తులు ఇప్పుడు వాటిని బయటపెడతామని హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ హెచ్చరింపులను ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కొట్టిపారేస్తున్నారు. తనకు పేకాట క్లబ్బుకు ఎలాంటి సంబంధం లేదన్న విషయం ఈపాటికే నిర్దారణ అయిపోయిందని చెబుతున్నారు. కొంత మంది కావాలని తన ప్రతిష్టకు భంగం కలిగించి రాజకీయంగా లబ్ది పొందేందుకు చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయని చెబుతున్నారు. పైగా పార్టీ అధిష్టానం కూడా తనకు క్లీన్ చిట్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. కొంత మంది స్వార్థపరుల తనపై కక్ష కట్టి ఇలాంటివి చేయిస్తున్నారని ఆమె చెబుతున్నారు. మరోవైపు పార్టీ అధిష్టానం కూడా సదరు ఎమ్మెల్యే కు ఎలాంటి సంబంధం లేదని భావిస్తోంది.