Stephen Harper: భారత్‌ను విడదీయాలనుకునే శక్తులకు మద్దతు తగదు: స్ట్రాంగ్ వార్నింగ్

వేగంగా మారుతున్న జాతీయ, అంతర్జాతీయ సంబంధాల మధ్య కెనడా మాజీ ప్రధాని స్టీఫెన్ హార్పర్ మళ్లీ వార్తల్లోకెక్కారు. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న హార్పర్, ఖలిస్థానీ వేర్పాటువాద శక్తులకు మద్దతు ఇస్తున్న రాజకీయ పార్టీలపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. “ఇలాంటి గుంపులతో సంబంధాలు కొనసాగిస్తూ భారతదేశంతో స్నేహబంధం కొనసాగించాలని ఆశించడం విరుద్ధమైంది” అని స్పష్టం చేశారు.

కెనడాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకునే ఏ పార్టీ అయినా, భారత్‌ను లక్ష్యంగా చేసుకుని పనిచేస్తున్న విభజనశక్తులతో తక్షణమే బంధాలు తెంచుకోవాలని హార్పర్ హితవు పలికారు. అంతే కాకుండా, తన పదవీకాలంలో ఇలాంటి సంచలన అంశాలకు దూరంగా ఉన్నామని గుర్తు చేశారు. “విడుదల కోరే గుంపుల నుంచి దూరంగా ఉంటేనే ద్వైపాక్షిక సంబంధాల్లో వృద్ధి సాధ్యమవుతుంది” అని అన్నారు.

జిహాదీలు, ఖలిస్థానీలు, యాంటీసెమిట్ గ్రూపులపై హార్పర్ ప్రత్యేకంగా వ్యాఖ్యానించారు. “ఇలాంటి అరాచక శక్తుల కారణంగానే రెండు దేశాల మధ్య అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. వీటిని ప్రోత్సహించడం మానాల్సిందే. భారతదేశం అనేది శాంతియుత సహజీవనానికి నిలయంగా మారుతోంది. అలాంటి దేశానికి వ్యతిరేకంగా వ్యవహరించడం హానికరం” అని హెచ్చరించారు.

ఖలిస్థానీ ఉగ్రవాదం నేపథ్యంలో 1985లో జరిగిన కనిష్క విమాన బాంబు దాడిని హార్పర్ మరోసారి గుర్తు చేశారు. తాను ప్రధానిగా ఉన్నప్పుడు, దీనిపై విచారణ కమిషన్ ఏర్పాటు చేయడం, భారతదేశానికి ప్రభుత్వం తరఫున క్షమాపణలు చెప్పడం తాను చేసిన బాధ్యతాయుతమైన చర్యలని గుర్తుచేశారు. ఇప్పుడు కూడా అదే నైతిక బాధ్యతను ప్రస్తుత నాయకత్వం చేపట్టాలని హార్పర్ సూచించారు. ఈ వ్యాఖ్యలు కెనడా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.

Telugu Tea Talks Kusum Ganji Most Interesting Interview || Kusum Ganji About Ys Jagan ||TeluguRajyam