ఆంధ్రలో టిడిపితో కాంగ్రెస్ 6,20 ఫార్ములాతో పొత్తు?

(వి. శంకరయ్య*)

కాంగ్రెస్ టిడిపి జట్టు కట్టడం అధికారికంగా  బహిర్గతం కాక ముందే ఒక పక్షం రోజుల క్రితమే ప్రజాశక్తి పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. అందులో కాంగ్రెస్ పార్టీ కోరే అసెంబ్లీ పార్లమెంటు స్థానాల గురించి పేర్కొంటూ 6-20 పథకాన్ని వెల్లడించింది. టిడిపి కాంగ్రెస్ జట్టు కడతాయని ఆరు పార్లమెంటు స్థానాలు 20 శాసన సభ స్థానాలు కాంగ్రెస్ కోరుతోందని టిడిపి కూడా అంగీకరించ వచ్చినేది ఆ వార్త సారాంశం.అనంతరం రాహుల్ గాంధీ దూతగా కాంగ్రెస్ అగ్ర నేత ఒకరు అమరావతి లో ముఖ్యమంత్రి చంద్రబాబు ను కలిసిన తర్వాత ప్రజాశక్తి కధనం వాస్తవం అయ్యే విధంగా కాంగ్రెస్ కోరే స్థానాల గురించి రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ప్రస్తుతం 20 నుండి 25 శాసన సభ స్థానాలు కోరు తున్న టు సరిగ్గా అదే వార్తలు వింటున్నాము. పార్లమెంటు కు చెంది సీమ లో కాంగ్రెస్ కోరుతున్న స్థానాలను చంద్రబాబు ఎట్టి పేచీ లేకుండా ఇచ్చే అవకాశం ఉంది.

ఎందుకంటే చిత్తూరు కడప నెల్లూరు జిల్లాలో గల తిరుపతి రాజంపేట స్థానాలు కావాలని టిడిపిలో అడిగే వారు లేరు. తిరుపతి రిజర్వు డు స్థానం. 2014 ఎన్నికల్లో తిరుపతి స్థానం బిజెపి కి ఇచ్చారు. వైసిపి చేతిలో ఓటమి చెందారు. రేపు కూడా ఈ స్థానంలో టిడిపి అభ్యర్థి గెలుపొందే అవకాశం ఏ మాత్రం లేదు. పైగా కావాలని కోరే నేతలేరు. కాకుంటే వర్ల రామయ్య లాంటి వారిని దిగుమతి చేసు కోవాలి. గతంలో ఒక మారు దిగుమతి రాజకీయం చేసి టిడిపి చేతులు కాల్చుకొని వుంది. . ఈ స్థానంలో నెల్లూరు జిల్లాలో గల నియోజకవర్గాలో టిడిపికి తీవ్ర మైన ఎదురు గాలి వుంది. మరో విశేషం ఏమంటే మొన్న నెల్లూరులో ధర్మ పోరాట దీక్ష జరిగిన రోజునే టిడిపి కొమ్ము కాచే పత్రిక ఒక కధనం ప్రకటించుతూ ఎదురు గాలి గురించి నియోజక వర్గాల వారిగా వివరించింది. పైగా తిరుపతి పార్లమెంటు స్థానంలో గల శాసన సభ నియోజకవర్గాలలో టిడిపి బలహినంగానూ ముఠా తగాదాలతో వుందని తెలిపింది. . అయితే గియితే అభ్యర్థులను మార్చక పోతే చిత్తూరు జిల్లాలోని శ్రీ కాళహస్తి సత్య వేడు నియోజకవర్గాలు గల్లంతే. ఈ దృష్ట్యా తిరుపతి స్థానం కాంగ్రెస్ కు ఇచ్చేందుకు అభ్యంతరాలు వుండక పోవచ్చు. . కాంగ్రెస్ కూడా మాజీ పార్లమెంటు సభ్యులు చింతా మోహన్ నుదృష్టి లో పెట్టుకుని కోరింది. గతంలో చింతామోహన్ ఈ స్థానం నుండి గెలుపొంది వున్నారు .అటుయిటు తిరిగి చింతామోహన్ రొట్టె విరిగి నోతిలో పడుతుందేమో. అప్పుడే చింతామోహన్ పర్యటనలు మొదలు పెట్టారు. 

కాగా రాజంపేట స్థానం కూడా టీడీపీ కి గాలికి పోయే పిండి కృష్ణార్పణం లాంటి దే. 2014 లో వైసిపి గెలుపొందినది. ప్రస్తుతం కూడా టీడీపీ కి అది బలమైన స్థానంకాదు. . ఈ స్థానంలో పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి ప్రాబల్యం ఎక్కువ. పైగా కడప జిల్లాలోని నియోజకవర్గాలు వున్నాయి. 2014 ఇది బిజెపి కి ఇచ్చారు. ఓడి పోయారు.

ప్రస్తుతం ఈ స్థానాన్ని కాంగ్రెస్ కోరుతోంది. ఈ స్థానంలో కాంగ్రెసు కు వున్న నేత ఒక్కరే.

కాంగ్రెస్ పార్టీ కి కిరణ్ కుమార్ రెడ్డి తప్ప వేరే నేత లేని నేపథ్యంలో అదే జరిగితే టిడిపి పువ్వులలో పెట్టి కాంగ్రెసు కు అప్పగించే అవకాశముంది ఫలితంగా టిడిపి కి మంచి మేలే జరుగుతుంది. పీలేరు శాసన సభ స్థానం వైసిపి చేతిలో వుంది ఇది వైసిపి కి బలమైన స్థానం. టిడిపి బలహీనంగా వుంది… . కాంగ్రెస్ టిడిపి జట్టు కట్టక ముందే పథకం ప్రకారం కావచ్చు కాక పోవచ్చు. కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిశోర్ కుమార్ రెడ్డి టిడిపి తీర్థం పుచ్చు కొని ప్రభుత్వ పదవి కూడా పొంది అధికార లాలసత అనుభవిస్తున్నారు. ప్రస్తుతం సోదరులిరువురి మధ్య మంచి సంబంధాలు లేకున్నా మున్ముందు రాజకీయ అవసరాలు ఒకటి చేసే అవకాశముంది. . తమ్ముడు శాసన సభకు టిడిపి తరపున అన్న కాంగ్రెస్ తరపున పార్లమెంటు కు పోటీ చేసేటిగా వుంటే చంద్రబాబు అడ్డం చెప్పకుండా అంగీకరించుతారేమో.

 

కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశించితే కిరణ్ కుమార్ రెడ్డి సిద్ధం కావచ్చు. అందుకు సూచికగా పీలేరుకు వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి తన అనుచరులతో సంప్రదింపులు జరిపారు. పైగా పత్రికల వారితో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు పై విమర్శలు చేయకుండా వెళ్లారు. చేసిన విమర్శలు కూడా కర్ర విరగ కుండా పాము చావ కుండా చేశారు. వాస్తవంలో ఘాటైన విమర్శలు చేయాలి. ఒక ముఖ్యమంత్రి గా జిల్లాలో తన ముద్ర వుండేందుకు కిరణ్ కుమార్ రెడ్డి కొన్ని ఉపయోగపడే పధకాలు అమలు చేశారు. కానీ చంద్రబాబు అవన్నీ రద్దు చేశారు. ఇందువలన జిల్లాకు తీవ్ర మైన అన్యాయం జరిగింది. కిరణ్ కుమార్ రెడ్డి ప్రతిష్టుకు భంగంకలిగింది. ఈ పరిస్థితి లో కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబు పై విమర్శలు చేసి వుండాలి. ఆలా జరగలేదు. కిరణ్ కుమార్ రెడ్డి ఏ ఉద్దేశంతో పరిమిత మైనారో చూడాలి. పైగా పెదిరెడ్డి రామచంద్రారెడ్డిని టిడిపి నిలువ రించే అవకాశాలు ఈ ప్రాంతంలో తక్కువ కాబట్టి 
కిరణ్ కుమార్ రెడ్డి పోటీ కి సిద్ద మైతే టిడిపి అంగీకరించే అవకాశం ఉంది. వేరే కాంగ్రెస్ నేత లేరు. ముఖ్యమంత్రి పదవిఅనుభవించిన కిరణ్ కుమార్ రెడ్డి ఓడి పోయే అవకాశం వుంటే తను సిద్ధం కాకుండా తన కుమారుడు నుపోటీకి దింపే అవకాశమూవుంది. మరి కాంగ్రెస్ ఏ ఉద్దేశంతో ఈ స్థానం కోరిందో ఈ చిదంబరరహస్యం తొందరలోనే బయట పడ వచ్చు.

 


కాంగ్రెస్ పార్టీ కర్నూలు స్థానం కోరిందంటే కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి ని దృష్టి లో పెట్టుకొనే కోరారు. వాస్తవంలో రేపు ఎన్నికల్లో జగన్ ను కర్నూలు జిల్లాలో నిలువ రించాలంటే కోట్ల కుటుంబానికి చెందిన వారి అండ తప్పని సరి. . పైగా మొన్నటి వరకు ఊగిస లాడిన బైరెడిరాజశేఖ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చు కున్నారు. ఫలితంగా కోట్ల కుటుంబానికి కొంత బలం చేకూరింది.

ఇవన్నీ అటుంచి 2014 ఎన్నికల్లో వైసిపి తరపున బుట్టా రేణుక గెలుపొంది ఇటీవల టిడిపి తీర్థం పుచ్చు కున్నారు. ఆ మధ్య కర్నూలు జిల్లాకు వెళ్లిన మంత్రి లోకేష్ వచ్చే ఎన్నికల్లోరేణుక పోటీ చేస్తుందని చేసిన ప్రకటన జిల్లా టీడీపీ లో పెద్ద చిచ్చు పెట్టింది. రాజ్యసభ సభ్యులు వెంకటేష్ కుమారుడు భరత్ ఈ స్థానం పై తొలి నుండి కన్నేసి వున్న నేపథ్యంలో పెద్ద రాద్ధాంతం జరిగింది. ప్రస్తుతం టిడిపి కాంగ్రెస్ జట్టు కట్టడం ఖాయమైంది. వాస్తవం చెప్పాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెసు పార్టీ కర్నూలు స్థానం వదిలి పెట్టే అవకాశం వుండదు. అయితే చంద్రబాబు కు కాంగ్రెసు డిమాండ్ బాగా కలిసి వస్తుందేమో. . రెండు పిల్లలు వెన్న ముద్ద కోతి కథ అనుభవానికి వస్తుందేమో. కాంగ్రెస్ తో జట్టు కట్టడం చారిత్రక అవసరంఅనే పేరు చెప్పి అటు రేణుకకు ఇటు భరత్ కు చంద్రబాబు అతి సులభంగా చుక్కలు చూపించ వచ్చు.

టిడిపి కాంగ్రెస్ జట్టు కట్టడం ఇక తిరుగు లేనిదే. ఏతావాతా సీమకు చెంది కాంగ్రెస్ కోరిన స్థానాలు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కు పెద్ద అడ్డంకులు వుండనందున గెలుపు ఓటములు పక్కన బెడితే కాంగ్రెస్ కు టీడీపీ కన్నా మేలు జరుగుతుంది . కనీసం డిపాజిట్ లు కోల్పోయిన చోట వీలైతే గెలుపొంద వచ్చు. లేదా పార్టీ పరంగా కాలు నిలదొక్కు కొన వచ్చు. సీమ లో ఈ కలయిక వలన టిడిపి కి కాంగ్రెస్ నుండి వచ్చే లాభం ఓట్ల పరం గా పెద్ద గా వుండదు. కోట్ల కుటుంబం వారి పలుకు బడితో టిడిపి కి కొన్ని ఓట్లు పడవచ్చును. . కిరణ్ కుమార్ రెడ్డి విషయం అంతే. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు అతి స్వల్పం. వున్నది మొత్తం వైసిపి వెంట పోయింది
. సీమ లో మైనారిటీలు ఎక్కువ 2014 లో కట్ట గట్టు కొని వైసిపికి వేశారు. దళితులు అంతే. ఆ ప్రమాదం నుండి బయట పడేందుకే ప్రధాని మోడీని రోజు చంద్రబాబు తిట్టి పోస్టునారు. పైగా మైనారిటీ నేతలకు మూడు పదవులు ఇచ్చారు. నేతలకు పదవులు ఇచ్చినంత మాత్రాన ఓటర్లు సంతృప్తి చెందుతారా? చంద్రబాబు ఎత్తు గడలు ఎంత వరకు ఫలిస్తాయో వేచిచూడాలి. అదే సమయంలోటిడిపిలోని పాత కాపులు కర్నూలు లాంటి చోట గోడ దూకే అవకాశాలు లేక పోలేదు.

ఈ ఓటమి భయంతోనే చంద్రబాబు నాయుడు పలు అడ్డ దారులు తొక్కుతునారు. నేతల నుండి ప్రజల నుండిఎదురు ప్రశ్నలు రాకుండా వుండేందుకు ఒక్కో తప్పుటడుగుకు అందమైన పేర్లు పెడుతున్నారు. అంతిమంగా ఫలితం ఏలా వుంటుందో చూడాలి. చంద్రబాబు జగన్ ఇద్దరిలో ఎవరు ఓడినాఅంతిమంగా రాష్ట్రంలో వారు దుకాణం కట్టేయ వలసిందే.

 

(*రచయిత రాయలసీమ రాజకీయ వ్యాఖ్యాత, ఫోన్ నెం 9848394013)